Begin typing your search above and press return to search.

గ్రాఫిక్ సీన్ కాదు.. నిజంగానే పాము బొట్టు పెట్టిందట

By:  Tupaki Desk   |   11 Aug 2021 3:11 AM GMT
గ్రాఫిక్ సీన్ కాదు.. నిజంగానే పాము బొట్టు పెట్టిందట
X
నమ్మలేనట్లుగా ఉండే ఉదంతాల గురించి కొన్నిసార్లు వింటుంటాం. నిజమేనా? అన్న సందేహాం కలుగుతుంది. అలాంటి సిత్రం గురించి వెల్లడించారు నటి వనిత. సూపర్ హిట్ ‘దేవి’ మూవీలో సుశీల పాత్రలో అందరిని ఆకట్టుకోవటమే కాదు.. తెలుగు ప్రజలకు అప్పట్లో కనెక్టు అయిన ఆమె ఆ తర్వాత సినిమాల్లో కనిపించలేదు. వ్యక్తిగత కారణాలతో ఇండస్ట్రీకి దూరంగా ఉన్నారు. తాజాగా ఆమె ఒక కార్యక్రమంలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆసక్తికర విషయాల్ని చెప్పుకొచ్చారు. తెలుగునాట ‘దేవి’ సినిమా రేపిన సంచలనం అంతా ఇంతా కాదు.

ఈ సినిమా విడుదలైన వేళ.. సినిమాను వేసే థియేటర్లు ఆలయాలుగా మారటం.. థియేటర్లలో పూనకాలు రావటం.. లాంటి ఎన్నో విశేషాల్ని సొంతం చేసుకుంది. ఒక సోషియో ఫాంటసీ మూవీకి అంతటి సూపర్ హిట్ కావటం అప్పట్లో సంచలనమైంది. ఈ సినిమాలో ఒక సీన్ లో నాగుపాము వనిత నుదిటిన బొట్టు పెడుతుంది. ఇది గ్రాఫిక్ సీన్ అనుకుంటారు కానీ.. నిజంగానే పాము బొట్టు పెట్టినట్లుగా చెప్పారు వనిత. షూటింగ్ లో జరిగిన దీన్ని అక్కడి వారంతా ఒక అద్భుతంగా భావించారని చెప్పింది. వారి ఇంటి ఇలవేల్పుగా నాగదేవతను కొలుస్తుంటారని.. దేవి సినిమా చేసే వేళలో.. షూటింగ్ లో జరిగిన అద్భుతం గురించి చెప్పుకొచ్చారు.

కాకుంటే.. నుదుటున బొట్టు పెట్టిన ఆ పాటు తిరిగి పుట్టలోకి వెళ్లే క్రమంలో మాత్రం తన వేలుని కొరికిందని.. అప్పుడు తాను భయపడినట్లు చెప్పారు. అయితే.. తన తల్లి మాత్రం వేలు కాదు.. చేయి పోయినా ఫర్లేదని.. నాగదేవత అనుగ్రహం ఉందని చెప్పినట్లు పేర్కొన్నారు. తాను ప్రేమలో పడటం వల్ల సినిమాలు చేయలేదని.. ఇప్పుడు అవకాశం వస్తే సినిమాలు చేయటానికి రెఢీ అని చెప్పారు. తెలుగు సినిమాలు చేయాలని తాను భావిస్తున్నట్లు చెప్పిన ఆమె.. చిన్నతనం నుంచి తనకు నాగార్జున అంటే చాలా ఇష్టమని.. జూనియర్ ఎన్టీఆర్ కు పెద్ద అభిమానిగా ఆమె చెప్పారు. తన జీవితంలో ఒక్క షాటో లో అయినా జూనియర్ ఎన్టీఆర్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవాలన్నదే తన కలగా ఆమె పేర్కొన్నారు. తారక్.. వింటున్నారా?