Begin typing your search above and press return to search.

మహేశ్ చెప్పినా.. మాట వినడంలేదట!

By:  Tupaki Desk   |   26 Sep 2017 5:16 AM GMT
మహేశ్ చెప్పినా.. మాట వినడంలేదట!
X
దిల్ రాజు కాంపౌండ్ ద్వారా చిత్ర పరిశ్రమకు పరిచయమైన దర్శకుడు వంశీ పైడిపల్లికి ప్రస్తుతం బ్యాడ్ టైమ్ నడుస్తోంది. పెద్ద హీరోలతో సినిమాలు చేసినా ఈ యంగ్ డైరెక్టర్ బిజీ అవ్వలేకపోతున్నాడు. అయితే ఇలా వంశీకి ఎక్కువ గ్యాప్ రావడానికి కారణం అతడి డిమాండ్ చేస్తున్న పారితోషికమే అని సినీజనాలు అంటున్నారు. ఎవడు - ఊపిరి వంటి సూపర్ హిట్లు తన ఖాతాలో ఉన్నాయని, ఆ రేంజ్ లోనే తనకు పారితోషికం ఇవ్వాల్సిందే అని వంశీ పైడిపల్లి తన దగ్గరకి వచ్చే నిర్మాతల్ని పట్టుబడుతున్నట్లుగా తెలిసింది. నిజానికి అఖిల్ రెండో సినిమాను వంశీ డైరెక్షన్ లోనే ప్లాన్ చేశారు. ఈ సినిమాను పి.వి.పి బ్యానర్ నిర్మించేందుకు ముందుకు వచ్చింది. సినిమా బడ్జెట్ తదితర అంశాలు ఓకే అయ్యాక - వంశీ రెమ్యూనీరేషన్ దగ్గర డీల్ సెట్ అవ్వకపోవడంతో అఖిల్ రీ లాంఛ్ బాధ్యతల్ని విక్రమ్ కుమార్ తీసుకున్నాడనే టాక్ ఉంది. ఇది కాసేపు పక్కనపెడితే, వంశీ పైడిపల్లి నెక్ట్స్ ప్రాజెక్ట్ మహేశ్ తో ఉంటుందని అంటున్నారు.

ప్రస్తుతం మహేశ్ బాబు - కొరటాల శివ కాంబినేషన్ లో భరత్ అను నేను అనే సినిమా తెరెకెక్కుతోంది, ఆ తరువాత వంశీ పైడిపల్లి డైరెక్షన్ లో మహేశ్ నటిస్తాడని అంటున్నారు. అయితే ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కేలా లేదని వార్తలు వినిపిస్తున్నాయి. యధావిధిగా వంశీ కోట్ చేసిన రెమ్యూనీరేషన్ కి ప్రొడ్యూసర్లు ఒప్పుకోవడం లేదట, దీంతో ఏకంగా మహేశ్ ఈ విషయాన్ని సెటిల్ చేయడానికి ట్రై చేస్తే - పారితోషికం విషయంలో వెనక్కి తగ్గేది లేదని వంశీ పైడిపల్లి అటు నిర్మాతలకి ఇటు హీరోకి తేల్చిచెప్పినట్లుగా తెలిసింది. మరి ల్యాంగ్ గ్యాప్ తరువాత మహేశ్ వంటి స్టార్ హీరో అవకాశం ఇస్తే లేని పోని కారణాలతో వంశీ పైడిపల్లి ఈ గోల్డెన్ ఛాన్స్ ను పొగ్గొట్టుకునే ప్రయత్నం చేస్తున్నాడని సినీజనాలు అంటున్నారు. చూద్దాం ఏం జరుగుతుందో!