Begin typing your search above and press return to search.

2020లో చ‌ర‌ణ్‌- పైడిప‌ల్లి మూవీ

By:  Tupaki Desk   |   7 Sep 2018 4:10 AM GMT
2020లో చ‌ర‌ణ్‌- పైడిప‌ల్లి మూవీ
X
రెండేళ్ల‌కో సినిమా చొప్పున తాపీగా ప‌ని చేయ‌డం వంశీ పైడిప‌ల్లి అల‌వాటు. అలా ప‌దేళ్ల కెరీర్‌ లో అత‌డు తీసింది ఐదారు సినిమాలే. అందులో ఒకే ఒక్క సినిమా త‌ప్ప‌ అన్నీ బ్లాక్‌ బ‌స్ట‌ర్లే. స్టో అండ్ స్టడీ విన్స్ ది రేస్! అన్న తీరుగా ఆయ‌న శైలి ఉంటుంది. ఇదివ‌ర‌కూ ఎన్టీఆర్ - చ‌ర‌ణ్‌ - ప్ర‌భాస్ లాంటి స్టార్ల‌ను డైరెక్ట్ చేశాడు పైడిప‌ల్లి. ఇప్పుడు సూప‌ర్‌ స్టార్‌ మ‌హేష్‌ ని డైరెక్ట్ చేస్తున్నాడు. మ‌హేష్ ల్యాండ్ మార్క్ మూవీ `మ‌హ‌ర్షి`ని బ్లాక్‌ బ‌స్ట‌ర్ చేయ‌డ‌మే ధ్యేయంగా ప‌ని చేస్తున్నాడు. ఇటీవ‌లే రిలీజ్ చేసిన మ‌హ‌ర్షి ఫ‌స్ట్‌ లుక్ - టైటిల్‌ కి అద్భుత స్పంద‌న వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా త‌ర్వాత వంశీ పైడిపల్లి ప్లానింగ్ ఏంటి? ఏ హీరోతో సినిమా తీస్తాడు? అత‌డి మైండ్‌ లో ఎవ‌రున్నారు? అంటే అందుకు ఆన్స‌ర్ వచ్చేసింది.

వాస్త‌వానికి `ఎవ‌డు` లాంటి బ్లాక్‌ బ‌స్ట‌ర్ తెర‌కెక్కించిన వంశీ పైడిప‌ల్లి రామ్‌ చ‌ర‌ణ్‌ తో మ‌రో సినిమా తీసేందుకు స‌న్నాహాలు చేస్తున్నార‌ని అప్ప‌ట్లో ప్ర‌చార‌మైంది. కానీ ఎందుక‌నో ఆ ప్రాజెక్టు కుద‌ర‌లేదు. చివ‌రికి అదో గాసిప్‌ లానే మిగిలిపోయింది. కానీ ఈ సారి మాత్రం పైడిప‌ల్లి ఆ ఛాన్స్ మిస్ చేసుకునే ఆలోచ‌న‌లో లేడుట‌. ఇప్ప‌టికే `ఎవ‌డు` చిత్రానికి ప‌ని చేసిన హ‌రి అనే ర‌చ‌యిత ఓ ఆస‌క్తిక‌ర లైన్‌ ని పైడిప‌ల్లికి - చ‌ర‌ణ్‌ కి వినిపించాడ‌ట‌. ఆ లైన్ ఇద్ద‌రికీ న‌చ్చింది. వెంట‌నే డెవ‌ల‌ప్ చేయాల‌ని చెర్రీ ఆర్డ‌ర్స్ వేశాడ‌ట‌. అంటే పూర్తి స్క్రిప్టు రెడీ అయ్యి చ‌ర‌ణ్‌ కి న‌చ్చితే ఇక సెట్స్‌ పైకి వెళ్లిపోవ‌డ‌మే. ఎవ‌డు లాంటి బ్లాక్‌ బ‌స్ట‌ర్ ఆ ఇద్ద‌రి నుంచి వ‌చ్చింది కాబ‌ట్టి మార్కెట్ వ‌ర్గాల్లోనూ దీనిపై క్యూరియాసిటీ ఉంటుంద‌న‌డంలో సందేహం లేదు.

రామ్‌ చ‌ర‌ణ్ ఓవైపు బోయ‌పాటి ద‌ర్శ‌క‌త్వంలో ఆర్‌ సి 12 చిత్రం తెర‌కెక్కిస్తూనే - మ‌రోవైపు `సైరా-న‌ర‌సింహారెడ్డి` లాంటి ప్ర‌తిష్ఠాత్మ‌క చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఆర్‌ సి 12 సంక్రాంతికి రిలీజ‌వుతుంది. సైరా స‌మ్మ‌ర్‌ కి ప్లాన్ చేశారు. అంటే పైడిప‌ల్లి స్క్రిప్టు రెడీ అయితే 2019 ఎండింగ్‌ లో కానీ, లేదా 2020లో కానీ ఈ కాంబో సెట్స్‌ పైకి వెళ్లే ఛాన్సుంద‌న్న‌మాట‌. దీనిపై అధికారికంగా మ‌రిన్ని వివ‌రాలు తెలియాల్సి ఉందింకా. ఈ క్రేజీ కాంబినేష‌న్ వాస్త‌వ‌రూపం దాల్చాల‌నే మెగాభిమానులు కోరుకుంటున్నారు. ఆ మేర‌కు పైడిపల్లి ప్లానింగు ఎలా ఉంటుందో చూడాలి. ప్ర‌స్తుతానికి అత‌డి దృష్టి అంతా `మ‌హ‌ర్షి`ని ఎలా బ్లాక్‌ బ‌స్ట‌ర్ చేయాల‌న్న‌దే! అదొక్క‌టే టార్గెట్‌.