Begin typing your search above and press return to search.

వంశీ దర్శకత్వంలో రౌడీ..?

By:  Tupaki Desk   |   26 March 2021 8:30 AM GMT
వంశీ దర్శకత్వంలో రౌడీ..?
X
'మున్నా' సినిమాతో డైరెక్టర్ గా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన వంశీ పైడిపల్లి.. ఆ తర్వాత 'బృందావనం' 'ఎవడు' 'ఊపిరి' 'మహర్షి' వంటి సినిమాలను తెరకెక్కించాడు.13 ఏళ్ళ సినీ కెరీర్ లో కేవలం ఐదు సినిమాలే డైరెక్ట్ చేసిన వంశీ.. 'మహర్షి' సినిమా వచ్చి రెండేళ్లవుతున్నా తదుపరి ప్రాజెక్ట్ పై క్లారిటీ ఇవ్వలేదు. వెంటనే సూపర్ స్టార్ మహేష్ బాబుతో ఓ సినిమా ఉంటుందని అనుకున్నారు కానీ వర్కౌట్ కాలేదు. మరోవైపు మిగతా స్టార్ డైరెక్టర్స్ అందరూ వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉంటున్న తరుణంలో వంశీ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఎంటనేది ప్రశ్నార్థకంగా మారింది.

ఈ నేపథ్యంలో సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ తో వంశీ పైడిపల్లి ఓ సినిమా చేయనున్నాడనే వార్తలు ఫిలిం సర్కిల్స్ లో వినబడుతున్నాయి. తను నాలుగు సినిమాలు చేసిన దిల్ రాజు బ్యానర్ లోనే ఈ సినిమా ఉంటుందట. విజయ్ ప్రస్తుతం పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో 'లైగర్' అనే పాన్ ఇండియా మూవీ చేస్తున్నాడు. దీని తర్వాత సుకుమార్ తో ఓ సినిమా.. శివ నిర్వాణ తో ఓ మూవీ కమిట్ అయ్యాడు. అయితే 'లైగర్' పూర్తై సుకుమార్ సినిమా స్టార్ట్ అయ్యే గ్యాప్ లో వంశీ పైడిపల్లి సినిమా ఉంటుందని టాక్ వినిపిస్తోంది.

'మహర్షి' సినిమా రెండు నేషనల్ ఫిలిం అవార్డ్స్ దక్కించుకోవడంతో వంశీ పైడిపల్లి మళ్ళీ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయ్యాడు. ఇన్నాళ్లూ ట్రోలింగ్ చేసిన వాళ్ళు సైతం వంశీని పొగుడుతున్నారు. ఇదే ఊపులో తదుపరి సినిమా స్టార్ట్ చేస్తే బాగుంటుందని అందరూ భావిస్తున్నారు. మరి పాన్ ఇండియా స్థాయిలో సినిమాలు ప్లాన్ చేసుకుంటున్న విజయ్ దేవరకొండ.. వంశీతో సినిమా చేస్తున్నాడనే వార్తల్లో నిజమెంతో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు ఆగాల్సిందే.