Begin typing your search above and press return to search.
క్యాన్సిల్ అన్నందుకు కాదు..లీకిచ్చినందుకే బాధ!
By: Tupaki Desk | 25 Feb 2020 2:52 PM GMTఒక స్క్రిప్ట్ ని ఫైనల్ చేసే ముందు మహేష్ ఎంత సీరియస్ గా ఆలోచిస్తున్నారో ఇటీవల పరిణామాలు చెబుతున్నాయి. తనకు ఎంత క్లోజ్ ఫ్రెండ్ అయినా .. హిట్లు ఇచ్చిన వాళ్లు అయినా.. ఎంత గొప్ప దర్శకుడు అయినా తనకు స్క్రిప్టు చాలా ముఖ్యం. ఆ విషయం పూరి - సుకుమార్ లాంటి డైరెక్టర్లను రిజెక్ట్ చేసినప్పుడే అర్థమైంది అందరికీ. ఇప్పుడు అలాంటి తిరస్కారమే మహర్షి ఫేం వంశీ పైడిపల్లికి ఎదురైంది.
అయితే ఆ సంగతి ఎలా లీకైందో కానీ.. అది కాస్తా మీడియాలో వైరల్ అయిపోవడంతో పైడిపల్లిని తీవ్రంగా బాధించిందట. మహేష్ క్యాన్సిల్ అన్నందుకు కాదు కానీ.. ఇలా మీడియాలో అనవసర ప్రొపగాండా జరిగిపోవడం తనని కలచివేసిందట. ఆ మేరకు పైడిపల్లి తన సన్నిహితుల వద్ద ఆ మాటను చెప్పుకుని బాధ పడ్డారట. ఇప్పటికి వాయిదా పడినా కొత్త కథను రెడీ చేయాల్సి ఉంటుంది కాబట్టి సమయం పడుతుంది. ఈలోగానే మహేష్ తో పైడిపల్లి ప్రాజెక్ట్ క్యాన్సిల్ అనేయడమే బాగా బాధించిందట.
ఇక మహేష్ - పైడిపల్లి మధ్య సాన్నిహిత్యం గురించి తెలిసిందే. మహర్షి రిలీజ్ తర్వాత ఇరు కుటుంబాల మధ్య మరింత స్నేహం కుదిరింది. అయితే స్నేహం వేరు సినిమా వేరు! అని మహేష్ చర్య చెబుతోంది. అందుకే సూపర్ స్టార్ ఇప్పుడు పరశురామ్ స్క్రిప్ట్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేయడం హీటెక్కిస్తోంది. తనకు స్క్రిప్టు నచ్చలేదు అని మహేష్ చెప్పినప్పుడు.. వేరే కథలు వినండి అని ఆయనే స్వయంగా సలహా ఇచ్చారట. కానీ మీడియానే పైడిపల్లిని షంటేయడంతో బాధ పడ్డారట. ఇక మహర్షి సినిమాని పూర్తిగా కమర్షియల్ ఫార్మాట్ లో తీయడంలో పైడిపల్లి విఫలమయ్యారని ఒక సెక్షన్ మీడియా అప్పట్లో విమర్శలు గుప్పించింది. బహుశా .. అది కూడా తాజా పరిణామానికి కారణమా? అన్న విశ్లేషణ కూడా సాగుతోంది. ఇక తాజా లీకుల విషయంలో మహేష్ - నమ్రత కాంపౌండ్ నుంచి లీకులిచ్చింది ఎవరు? అన్న చర్చా వేడెక్కిస్తోంది. ప్రాజెక్ట్ ఇప్పటికి క్యాన్సిల్ అయినా పైడిపల్లి ఎంత కసితో దూసుకొస్తాడు? అన్నదే అసలు పాయింట్. అలాగే తాను రీప్లేస్ చేశాడు కాబట్టి ఎంచుకున్న స్క్రిప్టు దమ్మున్నదే అని ప్రూవ్ అవ్వడం కూడా మహేష్ కి ముఖ్యం. ఇక స్క్రిప్టు విషయంలో రాజీ అన్నదే లేని మహేష్ థింకింగ్ హాట్ టాపిక్ గా మారింది.
అయితే ఆ సంగతి ఎలా లీకైందో కానీ.. అది కాస్తా మీడియాలో వైరల్ అయిపోవడంతో పైడిపల్లిని తీవ్రంగా బాధించిందట. మహేష్ క్యాన్సిల్ అన్నందుకు కాదు కానీ.. ఇలా మీడియాలో అనవసర ప్రొపగాండా జరిగిపోవడం తనని కలచివేసిందట. ఆ మేరకు పైడిపల్లి తన సన్నిహితుల వద్ద ఆ మాటను చెప్పుకుని బాధ పడ్డారట. ఇప్పటికి వాయిదా పడినా కొత్త కథను రెడీ చేయాల్సి ఉంటుంది కాబట్టి సమయం పడుతుంది. ఈలోగానే మహేష్ తో పైడిపల్లి ప్రాజెక్ట్ క్యాన్సిల్ అనేయడమే బాగా బాధించిందట.
ఇక మహేష్ - పైడిపల్లి మధ్య సాన్నిహిత్యం గురించి తెలిసిందే. మహర్షి రిలీజ్ తర్వాత ఇరు కుటుంబాల మధ్య మరింత స్నేహం కుదిరింది. అయితే స్నేహం వేరు సినిమా వేరు! అని మహేష్ చర్య చెబుతోంది. అందుకే సూపర్ స్టార్ ఇప్పుడు పరశురామ్ స్క్రిప్ట్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేయడం హీటెక్కిస్తోంది. తనకు స్క్రిప్టు నచ్చలేదు అని మహేష్ చెప్పినప్పుడు.. వేరే కథలు వినండి అని ఆయనే స్వయంగా సలహా ఇచ్చారట. కానీ మీడియానే పైడిపల్లిని షంటేయడంతో బాధ పడ్డారట. ఇక మహర్షి సినిమాని పూర్తిగా కమర్షియల్ ఫార్మాట్ లో తీయడంలో పైడిపల్లి విఫలమయ్యారని ఒక సెక్షన్ మీడియా అప్పట్లో విమర్శలు గుప్పించింది. బహుశా .. అది కూడా తాజా పరిణామానికి కారణమా? అన్న విశ్లేషణ కూడా సాగుతోంది. ఇక తాజా లీకుల విషయంలో మహేష్ - నమ్రత కాంపౌండ్ నుంచి లీకులిచ్చింది ఎవరు? అన్న చర్చా వేడెక్కిస్తోంది. ప్రాజెక్ట్ ఇప్పటికి క్యాన్సిల్ అయినా పైడిపల్లి ఎంత కసితో దూసుకొస్తాడు? అన్నదే అసలు పాయింట్. అలాగే తాను రీప్లేస్ చేశాడు కాబట్టి ఎంచుకున్న స్క్రిప్టు దమ్మున్నదే అని ప్రూవ్ అవ్వడం కూడా మహేష్ కి ముఖ్యం. ఇక స్క్రిప్టు విషయంలో రాజీ అన్నదే లేని మహేష్ థింకింగ్ హాట్ టాపిక్ గా మారింది.