Begin typing your search above and press return to search.

మెగా మేనల్లుడు వాటన్నిటినీ దాటుకొని క్రేజీ హీరోగా మారేనా...?

By:  Tupaki Desk   |   4 Sep 2020 2:30 AM GMT
మెగా మేనల్లుడు వాటన్నిటినీ దాటుకొని క్రేజీ హీరోగా మారేనా...?
X
మెగా ఫ్యామిలీ నుండి ఇండస్ట్రీలో అడుగుపెడుతున్న మరో హీరో పంజా వైష్ణవ్ తేజ్. చిరంజీవి మేనల్లుడుగా సాయి ధరమ్ తేజ్ సోదరుడుగా 'ఉప్పెన' సినిమాతో ఎంట్రీ ఇస్తున్నాడు. ఈ సినిమాకి సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సానా దర్శకత్వం వహించగా మైత్రీ మూవీ మేకర్స్ మరియు సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమాతో కృతీ శెట్టి హీరోయిన్‌ గా టాలీవుడ్‌ కు పరిచయమవుతోంది. 'మక్కల్ సెల్వన్' విజయ్ సేతుపతి కీలక పాత్రలో నటిస్తున్నారు. దేవీశ్రీ ప్రసాద్ స్వరపరచిన రెండు లిరికల్ సాంగ్స్ ఇప్పటికే విడుదలై మ్యూజిక్ లవర్స్ ని విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ సినిమాని సమ్మర్ కానుకగా విడుదల చేయాలని భావించినప్పటికీ వీలు పడలేదు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న 'ఉప్పెన' సినిమాకి మేకర్స్ భారీగానే ఖర్చు చేశారట. అయితే అంత ఇవ్వడానికి ఓటీటీలు ముందుకు రాకపోవడంతో డీల్ కుదరలేదని వార్తలు వస్తున్నాయి. దీంతో మెగా మేనల్లుడి ఫస్ట్ సినిమా ఏ వేదికపై రిలీజ్ అవుతుందో క్లారిటీ లేకుండా పోయింది.

ఇదిలా ఉండగా వైష్ణవ్ తేజ్ మొదటి సినిమా ప్రేక్షకుల ముందుకు రాకముందే నెక్స్ట్ ప్రాజెక్ట్ పట్టాలెక్కించేసాడు. స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తున్న ఈ సినిమాకి క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహిస్తున్నారు. రకుల్ ఏజ్ లోనూ క్రేజ్ లోనూ వైష్ణవ్ కంటే ఎక్కువ అని చెప్పవచ్చు. ఒక్కప్పుడు టాలీవుడ్ స్టార్ హీరోలతో నటించిన రకుల్ ఇప్పుడు అవకాశాలు సన్నగిల్లడంతో ఈ ప్రాజెక్ట్ కి ఓకే చెప్పిందని తెలుస్తోంది. అయితే ఈ సినిమాతో మళ్ళీ టాలీవుడ్ లో పాగా వేయాలని ర‌కుల్ చూస్తోంది. స్క్రీన్ మీద సీనియర్ ఆర్టిస్ట్ పోటీని తట్టుకుని మెగా హీరో ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. ఇలా మెగా హీరో నటించిన ఫస్ట్ సినిమా రిలీజ్ విషయంలో క్లారిటీ లేక.. నెక్స్ట్ సినిమా క్రేజ్ ఎక్కడ హీరోయిన్ కొట్టేస్తుందేమో అని మెగా అభిమానులు కాస్త నిరాశ చెందుతున్నారట. ఈ ఫస్ట్ సినిమా గండం వైష్ణ‌వ్ అన్న సాయిధరమ్ తేజ్ ని కూడా వెంటాడింది. తేజ్ ఫస్ట్ మూవీ 'రేయ్' రిలీజ్ విషయంలో కూడా ఇలానే ఇబ్బందులు తలెత్తాయి. మరి మెగా మేనల్లుడు వీటన్నిటిని దాటుకొని సోదరుడు సాయి ధరమ్ తేజ్ కి పోటీగా నిలుస్తాడేమో చూడాలి.