Begin typing your search above and press return to search.

మెగా 'ఉప్పెన'కు ముహూర్తం ఖరారు

By:  Tupaki Desk   |   22 Jan 2020 12:25 PM GMT
మెగా ఉప్పెనకు ముహూర్తం ఖరారు
X
మెగా ఫ్యామిలీ మెగా మేనల్లుడు.. సాయి ధరమ్‌ తేజ్‌ తమ్ముడు వైష్ణవ్‌ తేజ్‌ హీరోగా పరిచయం కాబోతున్న విషయం తెల్సిందే. మైత్రి మూవీ మేకర్స్‌ మరియు సుకుమార్ రైటింగ్స్ బ్యానర్‌ లలో సుకుమార్‌ శిష్యుడు బుచ్చిబాబు దర్శకత్వంలో వైష్ణవ్‌ తేజ్‌ హీరోగా 'ఉప్పెన' అనే చిత్రం రూపొందుతున్న విషయం తెల్సిందే. విజయ్‌ సేతుపతి కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈ చిత్రం కొన్ని కారణాల వల్ల ఆలస్యం అయినా ఎట్టకేలకు ముగింపు దశకు చేరుకున్నట్లుగా తెలుస్తోంది.

ఈ చిత్రం ఫస్ట్‌ లుక్‌ ను రేపు సాయంత్రం 4 గంటల 5 నిమిషాలకు విడుదల చేయబోతున్నట్లుగా చిత్ర యూనిట్‌ సభ్యులు ప్రకటించారు. షూటింగ్‌ ప్రారంభం రోజే వైష్ణవ్‌ తేజ్‌ ను బ్యాక్‌ యాంగిల్‌ లో చూపించిన చిత్ర యూనిట్‌ సభ్యులు ఈసారి ఫుల్‌ పిక్చర్‌ ను మెగా ఫ్యాన్స్‌ ముందు ఉంచబోతున్నారు. భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ఈ చిత్రంపై మెగా ఫ్యాన్స్‌ చాలా ఆశలే పెట్టుకున్నారు.

అన్న సాయి ధరమ్‌ తేజ్‌ కెరీర్‌ లో ఒడిదొడుకులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో వైష్ణవ్‌ తేజ్‌ అలాంటి ఇబ్బందులు పడకుండా మొదటి నుండే పక్కా ప్లానింగ్‌ తో మంచి సినిమాలు చేయాలని భావిస్తున్నాడు. అందుకోసం మెగా సపోర్ట్‌ కూడా చాలానే ఉందని ఇండస్ట్రీ వర్గాల టాక్‌. ఈ ఫస్ట్‌ లుక్‌ తో ఉప్పెన చిత్రంపై అంచనాలు పెరగడం ఖాయంగా కనిపిస్తుంది. సినిమాను సమ్మర్‌ ఆరంభంలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చే అవకాశం ఉందని సినీ వర్గాల వారు చెబుతున్నారు. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్‌ అందిస్తున్న సంగీతం హైలైట్‌ గా ఉంటుందని అంతా నమ్మకంగా ఉన్నారు. ఈ చిత్రంలో హీరోయిన్‌ గా కృతి శెట్టి నటిస్తోంది.