Begin typing your search above and press return to search.

నాగశౌర్య ‘యువి’ తోక తొక్కాడు

By:  Tupaki Desk   |   13 Dec 2015 11:30 AM GMT
నాగశౌర్య ‘యువి’ తోక తొక్కాడు
X
యువి క్రియేషన్స్.. టాలీవుడ్ లో ప్రస్తుతం మోస్ట్ హ్యాపెనింగ్ బేనర్లలో ఒకటి. ఈ బేనర్లో నటిస్తే ఆ హీరో దశ తిరుగుతుందని పేరుంది. ‘మిర్చి’ సినిమాతో ప్రభాస్ దశ ఎలా తిరిగిందో అందరూ చూశారు. ఆ తర్వాత ‘రన్ రాజా రన్’తో శర్వానంద్ - ‘జిల్’తో గోపీచంద్ - ‘భలే భలే మగాడివోయ్’తో నాని కూడా మంచి ఫలితాలే అందుకున్నారు. ఇప్పుడు మరో యువ కథానాయకుడు నాగ శౌర్య కూడా ఈ బేనర్ లో సినిమా చేసే ఛాన్స్ కొట్టేశాడు.

ఇప్పటికే ‘మిర్చి’తో కొరటాల శివను, ‘రన్ రాజా రన్’తో సుజీత్‌ను, ‘జిల్’తో రాధాకృష్ణకుమార్‌ ను దర్శకులుగా పరిచయం చేసిన యువి క్రియేషన్స్.. మరో కొత్త దర్శకుడిని పరిచయం చేస్తూ నాగశౌర్య హీరోగా నిర్మించబోతోంది. కొత్త ఏడాదిలో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది.

లక్ష్మీ రావే మా ఇంటికి - జాదూగాడు ఫ్లాప్ కావడంతో శౌర్య కెరీర్ కొంచెం డల్లుగా నడుస్తోంది. అతడి కొత్త సినిమా ‘అబ్బాయితో అమ్మాయి’ విడుదలకు సిద్ధమవుతుండగా.. నందిని రెడ్డి దర్శకత్వంలో నటించిన ‘కళ్యాణ వైభోగమే’ కూడా షూటింగ్ పూర్తి చేసుకుంది. మెగా అమ్మాయి నిహారికతో చేస్తున్న సినిమా సెట్స్ పైన ఉంది. యువి క్రియేషన్స్ కొత్త సినిమా ‘ఎక్స్‌ప్రెస్ రాజా’ సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది.