Begin typing your search above and press return to search.

థియేటర్ లో ‘ఉప్పెన’.. తగ్గేదే లేదంటున్న ప్రొడ్యూసర్స్

By:  Tupaki Desk   |   20 Dec 2020 8:50 AM GMT
థియేటర్ లో ‘ఉప్పెన’.. తగ్గేదే లేదంటున్న ప్రొడ్యూసర్స్
X
సినిమా థియేటర్లు మూసేసి ఇప్పటికి సరిగ్గా తొమ్మిది నెలలు. ‘ఇక తెరుచుకోండి’ అని ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చినా.. ఓపెన్ అయ్యే పరిస్థితి లేదు. ఇందుకు కారణం.. కరోనా భయం పూర్తిగా తొలగకపోవడం ఒకటయితే.. 50 శాతం ఆక్యుపెన్సీ తోనే రన్ చేసుకోవాలనే నిబంధన రెండోది. దీంతో.. తమ సినిమాలను రిలీజ్ చేసేందుకు డేర్ చేయలేకపోతున్నారు పలువురు నిర్మాతలు.

కానీ.. అందరి పరిస్థితి ఒకేలా ఉండదు కదా. ఇప్పటికే ఆర్థిక నష్టాల్లో ఉన్నవారు మాత్రం తమ సినిమాలను ఓటీటీల్లో రిలీజ్ చేశారు. ఈ జాబితాలో చిన్న సినిమాలే ఎక్కువగా ఉన్నాయి. అయితే.. తమ సినిమాను మాత్రం థియేటర్ లోనే రిలీజ్ చేయాలని డిసైడ్ అయ్యారట ‘ఉప్పెన’ నిర్మాతలు.

వైష్ణవ్ తేజ్, కృతి శెట్టి డెబ్యూ మూవీ ‘ఉప్పెన’. ఎప్పుడో పూర్తయిన ఈ చిత్రం రిలీజ్.. లాక్ డౌన్ కారణంగా నిరవధికంగా వాయిదా పడింది. ఫిల్మ్ సర్కిల్స్ తాజా సమాచారం ప్రకారం.. ‘ఉప్పెన’ నిర్మాతలు ఇంకా వెయిటింగ్ మోడ్‌లో ఉన్నారట. ఈ చిత్రాన్ని ఖచ్చితంగా థియేటర్లలో మాత్రమే విడుదల చేయాలని వారు యోచిస్తున్నారట. రాబోయే ఉగాది.. లేదా థియేటర్లలో 100 శాతం ఆక్యుపెన్సీ పర్మిషన్.. ఈ రెండిట్లో ఏది ముందుగా వస్తే అప్పుడు థియేటర్లలోనే విడుదల చేయనున్నట్ట సమాచారం.

కాగా.. ఈ చిత్ర ఆడియో ఇప్పటికే శ్రోతలను మెప్పించింది. ఇందులోని ‘నీ కన్ను నీలి సముద్రం’ అనే పాట యూట్యూబ్ లో హయ్యెస్ట్ వ్యూస్ సాధించిన టాప్ 20 జాబితాలో చోటు దక్కించుకుంది. దేవిశ్రీ ప్రసాద్ స్వరాలు సమకూర్చిన ఈ పాటను దాదాపు 15 కోట్ల 50 లక్షల మంది వీక్షించారు. మరి, సినిమా విడుదలై ఎలాంటి రిజల్ట్ సాధిస్తుందో చూడాలి.