Begin typing your search above and press return to search.

క్రేజీ స్టార్ ల దొంగా - పోలీస్ ఆట‌!

By:  Tupaki Desk   |   31 July 2022 3:30 AM GMT
క్రేజీ స్టార్ ల దొంగా - పోలీస్ ఆట‌!
X
మెగాస్టార్ చిరంజీవి మునుపెన్న‌డూ లేని విధంగా ప్ర‌స్తుతం మూడు భారీ ప్రాజెక్ట్ ల‌లో న‌టిస్తున్నారు. అంతులో రెండు రీమేక్ లు, ఒక‌టి స్ట్రెయిట్ ఫిల్మ్‌. ఇందులో మల‌యాళ హిట్ ఫిల్మ్ 'లూసీఫ‌ర్‌' ఆధారంగా 'గాడ్ ఫాద‌ర్‌'ని మోహ‌న్ రాజా రీమేక్ చేస్తున్నారు. ప్ర‌స్తుతం చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో వుంది. ద‌స‌రాకు ఎట్టిప‌రిస్థితుల్లో ఈ మూవీని ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురావాల‌ని ప్లాన్ చేస్తున్నారు. ఇటీవ‌లే రిలీజ్ సీజ‌న్ ని ప్ర‌క‌టించేశారు కూడా.

ఇదిలా వుంటే మ‌రో త‌మిళ హిట్ ఫిల్మ్ 'వేదాలం' ఆధారంగా 'భోళాశంక‌ర్‌' మూవీని మెహ‌ర్ ర‌మేష్‌ రీమేక్ చేస్తున్నారు. సిస్ట‌ర్ సెంటిమెంట్ నేప‌థ్యంలో రూపొందుతున్న ఈ మూవీలోని కీల‌క పాత్ర‌లో చిరుకు చెల్లెలుగా కీర్తి సురేష్ న‌టిస్తోంది. ఈ మూవీ షూటింగ్ కూడా దాదాపుగా చివ‌రి ద‌శ‌కు చేరుకుంది. ఇక స్ట్రెయిట్ స్టోరీతో చేస్తున్న 'వాల్తేర్ వీర‌య్య‌' ప్ర‌స్తుం చిత్రీక‌ర‌ణ జ‌రుపుకుంటోంది. ఈ మూవీలో మాస్ మ‌హారాజా ర‌వితేజ కీల‌క పాత్ర‌లో క‌నిపించ‌నున్న విష‌యం తెలిసిందే.

దాదాపు ప‌న్నెండేళ్ల త‌రువాత చిరుతో క‌లిసి ర‌వితేజ న‌టిస్తున్న ప్రాజెక్ట్ ఇది. చిరుతో క‌లిసి ర‌వితేజ గ‌తంలో 'అన్న‌య్య‌' మూవీ చేశారు. ఇందులో చిరుకు సోద‌రుడిగా క‌నిపించారు. మ‌ళ్లీ ఇన్నేళ్ల విరామం త‌రువాత అదే త‌ర‌హాలో చిరుకు త‌మ్ముడిగా తాజాగా చిత్రంలో న‌టిస్తున్నార‌ని తెలుస్తోంది. చిరు 154 ప్రాజెక్ట్ గా ప్ర‌స్తుతం సెట్స్ పై వున్న ఈ మూవీ కోసం ఇటీవ‌లే ర‌వితేజ సెట్ లోకి ఎంట్రీ ఇచ్చిన విష‌యం తెలిసిందే.

ఇందులో చిరు స‌వ‌తి తల్లి త‌న‌యుడిగా ర‌వితేజ క‌నిపించ‌నున్నారని వార్త‌లు వినిపిస్తున్న విష‌యం తెలిసిందే. తాజాగా ఈ ప్రాజెక్ట్ కు సంబంధించిన మ‌రో వార్త ఫిల్మ్ స‌ర్కిల్స్ లో చ‌క్కర్లు కొడుతోంది. ఈ మూవీలో ర‌వితేజ ప‌వ‌ర్ ఫుల్ పోలీస్ ఆఫీస‌ర్ పాత్ర‌లో న‌టిస్తున్నాడ‌ని ఇప్ప‌టికే ఓ వార్త బ‌య‌టికి వ‌చ్చింది. అత‌నికి ఓ భార్య‌, ఓ కూతురు వుంటార‌ని. భార్య పాత్ర‌లో కేథ‌రిన్ న‌టిస్తోంద‌ని తెలిసింది. అయితే తాజాగా మెగాస్టార్ చిరంజీవి పాత్ర‌కు సంబంధించిన ఆస‌క్తిక‌రమైన వార్త తాజాగా తెలిసింది.

ఇందులో చిరు, ర‌వితేజ స‌వ‌తి త‌ల్లి సోద‌రులుగా క‌నిపించ‌బోతున్నారు. అయితే ఓ ర‌వితేజ పాత్ర పోలీస్ కాగా చిరు దొంగ‌గా క‌నిపిస్తార‌ని, అన‌ని ప‌ట్టుకునే ప్ర‌యత్నంలో ఇద్ద‌రి మ‌ధ్య సాగే స‌న్నివేశాలు క‌థ‌కు ప్ర‌ధాన హైలైట్ గా నిలుస్తాయ‌ని ఇన్ సైడ్ టాక్‌.

ఇక ఇందులో ర‌వితేజ పాత్ర కేవ‌లం 40 నిమిషాలు మాత్ర‌మే వుంటుంద‌ట‌. ఇప్ప‌టికే ప‌లు యాక్ష‌న్ ఘ‌ట్టాల షూటింగ్ పూర్తి కావ‌డంతో దేవిశ్రీ‌ప్ర‌సాద్ ఫోర్ ట్యూన్స్ ని రెడీ చేసిన‌ట్టుగా తెలుస్తోంది. రి ఇద్ద‌రు స్టార్ ల దొంగా పోలీస్ ఆట ఎలా వుంటుందో తెలియాలంటే మ‌రి కొన్ని రోజులు వేచి చూడాల్సిందే.