Begin typing your search above and press return to search.

'ఖుషి' క్రిష్మస్ కు రావడం కష్టమేనా..?

By:  Tupaki Desk   |   16 Sep 2022 3:51 AM GMT
ఖుషి క్రిష్మస్ కు రావడం కష్టమేనా..?
X
రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ మరియు సౌత్ క్వీన్ సమంత రూత్ ప్రభు హీరోహీరోయిన్లుగా నటిస్తున్న తాజా చిత్రం ''ఖుషి''. శివ నిర్వాణ దర్శకత్వంలో ఈ రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ తెరకెక్కుతోంది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ లో రూపొందుతోన్న ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే సగానికి పైగా జరిగింది.

'ఖుషి' చిత్రాన్ని క్రిష్మస్ కానుకగా 2022 డిసెంబర్ 23న నాలుగు దక్షిణాది భాషల్లో విడుదల చేస్తామని మేకర్స్ డేట్ కూడా ప్రకటించారు. కానీ ఇప్పుడు పరిస్థితులు చూస్తుంటే అనుకున్న సమయానికి రావడం కష్టమే అని టాక్ నడుస్తోంది. అంతేకాదు కారణం సమంతనే అనే విధంగా మాట్లాడుకుంటున్నారు.

'లైగర్' సినిమా రిలీజ్ నేపథ్యంలో పాన్ ఇండియా ప్రమోషన్స్ కోసం విజయ్ 'ఖుషి' షూటింగ్ కు బ్రేక్ ఇచ్చాడు. అయితే ఈ సినిమా విడుదల అవడం.. బాక్సాఫీస్ వద్ద బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలవడం జరిగిపోయాయి. కానీ ఇప్పటి వరకూ 'ఖుషి' చిత్రాన్ని తిరిగి ప్రారంభించలేదు. వీడీ రెడీగా ఉన్నా.. సామ్ రెస్ట్ మోడ్ లో ఉండటమే దీనికి కారణమని రూమర్స్ వస్తున్నాయి.

సమంత గత కొన్ని వారాలుగా మీడియాకు సోషల్ మీడియాకు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. ఎప్పుడూ నెట్టింట యాక్టీవ్ గా ఉండే సామ్.. అప్పుడప్పుడు సినిమాలకు సంబంధించిన విషయాలు షేర్ చేస్తుందే తప్ప.. ఈ మధ్య తన ఫోటోలను పోస్ట్ చేయలేదు. దీంతో అనేక పుకార్లు పుట్టుకొచ్చాయి.

సమంత ఇప్పుడు ఏదో స్కిన్ ప్రాబ్లమ్ తో బాధ పడుతోందని.. కొన్ని మందులు పడకపోవడం వల్లనే ఆ సమస్య వచ్చిందని.. ప్రస్తుతం అన్ని పనులు పక్కన పెట్టి చికిత్స తీసుకుంటోందని.. ఇలా రకరకాల గాసిప్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి.

అయితే ఈ వార్తలను అధికారికంగా ధృవీకరించ లేదు.. అలా అని ఖండించనూ లేదు. కారణాలు ఏవైతేనేం సమంత ఇప్పుడు బ్రేక్ తీసుకుందని టాక్ రావడంతో.. 'ఖుషి' షూటింగ్ ఆలస్యమయ్యే అవకాశం ఉందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఒకవేళ ఇదే జరిగితే డిసెంబర్ 23న రావడం కష్టమే అనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

'ఖుషి' క్రిస్మస్ కు రెడీ అవ్వకపోతే మైత్రీ బ్యానర్ లో రూపొందుతున్న NBK107 ను రిలీజ్ చేసే ఆలోచన చేయొచ్చని అంటున్నారు. ఇక విజయ్ - సమంతల సినిమాని వచ్చే ఏడాది వాలెంటైన్స్ వీక్ లో రిలీజ్ ప్లాన్ చేసే ఛాన్స్ ఉంది. అయితే సమంత సెట్స్ మీదకు వచ్చే దాన్ని బట్టి విడుదల ఆధారపడి ఉంటుందని అంటున్నారు.

కాగా, 'మహానటి' తర్వాత సామ్ - విజయ్ కలిసి నటిస్తున్న సినిమా 'ఖుషి'. ఇందులో జయరాం - సచిన్ ఖేడేకర్ - మురళీ శర్మ - లక్ష్మీ - అలీ - రోహిణి - వెన్నెల కిషోర్ - రాహుల్ రామకృష్ణ - శ్రీకాంత్ అయ్యంగార్ - శరణ్య ప్రదీప్ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్నారు.

నవీన్ ఎర్నేని - వై రవిశంకర్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి 'హృదయం' ఫేమ్ హేషమ్ అబ్దుల్ వహాబ్ సంగీతం సమకూరుస్తున్నారు. జి మురళి సినిమాటోగ్రఫీ అందిస్తుండగా.. ప్రవీణ్ పూడి ఎడిటర్ గా వర్క్ చేస్తున్నారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.