Begin typing your search above and press return to search.

ఆ మాట ఇంకెవ‌రైనా అంటే బాల‌య్య‌ కొడ‌తార‌ట‌

By:  Tupaki Desk   |   11 Jan 2022 9:36 AM GMT
ఆ మాట ఇంకెవ‌రైనా అంటే బాల‌య్య‌ కొడ‌తార‌ట‌
X
`నేను మాట్లాడే ట‌ప్పుడు నీ చెవులు మాత్ర‌మే ప‌ని చేయాలి.. కాద‌ని ఇంకేది ప‌ని చేసినా నీకు నెక్స్ట్ బ‌ర్త్ డే వుండ‌దు...` అన్న‌ట్టుగా బాల‌య్య ఆ మాట నేను మాత్ర‌మే అనాలి.. ఇంకెవ్వ‌రైనా అంటే కొడ‌తా అంటూ హ‌ల్ చ‌ల్ చేస్తున్నారు. ఇందంతా `అన్ స్టాప‌బుల్ విత్ ఎన్ బి కె` టాక్ షోలో జ‌రిగింది. పాపుల‌ర్ ఓటీటీ `ఆహా` కోసం నంద‌మూరి బాల‌కృష్ణ `అన్ స్టాప‌బుల్ విత్ ఎన్ బి కె` టాక్ షో కు హోస్ట్ గా వ్య‌వ‌హ‌రిస్తున్న విష‌యం తెలిసిందే.

చాలా త‌క్కువ టైమ్ లోనే ఈ షో పాపులారిటీని సొంతం చేసుకుంది. ఈ షోలో ఇప్ప‌టి వ‌ర‌కు చాలా మంది సెల‌బ్రిటీలు పాల్గొన్నారు. వారితో బాల‌య్య చేసిన హంగామా అంతా ఇంతా కాదు. ఇటీవ‌ల రానాతో హ‌ల్ చ‌ల్ చేసిన బాల‌య్య తాజాగా `లైగ‌ర్` టీమ్ తో ఓ రేంజ్ లో ర‌చ్చ చేశారు. ఈ టాక్ షోలో పూరి జ‌గ‌న్నాథ్‌, ఛార్మి, విజ‌య్ దేవ‌ర‌కొండ పాల్గొన్నారు. తాజాగా దీనికి సంబంధించిన ప్రోమోని `ఆహా` టీమ్ విడుద‌ల చేసింది.

పంచెక‌ట్టులో ఎంట్రీ ఇచ్చిన బాల‌య్య బావుందా? అంటూ త‌న హావ భావాల‌తో అక్క‌డున్న వారిని అడిగిన తీరు న‌వ్వులు పూయించింది.. మాట‌ల గ‌న్ మ‌న జ‌గ‌న్ వెల్క‌మ్ జ‌గ్గూ అంటూ బాల‌య్య డైలాగ్ ల‌తో ప్రోమో మొద‌లైంది. పూరి జ‌గ‌న్నాథ్ షోలోకి ఎంట్రీ ఇచ్చి త‌న‌తో ఎలా మాట్లాడుతాడో బాల‌య్య ముందు ఏక పాత్రాభిన‌యం చేసి న‌వ్వించారు. ఏం జ‌గ్గూ లేటైందేంటీ? .. అని బాల‌య్య అడిగితే పూరి ` ఏం చెబుతారు సార్‌.. ఇద్ద‌రు ముగ్గురు గాళ్ ఫ్రెండ్స్ ... ఆ ఇండ‌కేంటి సార్ సంగ‌తులు... అంటుండ‌గానే పూరి జ‌గ‌న్నాథ్ వ‌చ్చి బాల‌య్య‌ని వెన‌క నుంచి హ‌గ్ చేసుకున్నాడు.

వెంట‌నే ఈ హ‌గ్గు జ‌గ్గుదే అని బాల‌య్య అంతా గొల్లున న‌వ్వేశారు. ఆ త‌రువాత వీరిద్ద‌రి తొలి క‌ల‌యిక‌లో వ‌చ్చిన `పైసా వ‌సూల్‌` మూవీ గురించి మాట్లాడుకున్నారు. నా కెరీర్ లో మ‌ర్చిపోలేని పాత్ర తేడా సింగ్ అని చెప్పిన బాల‌య్య `నేను ఎంత య‌ద‌వ‌నో నాకే తెలియ‌దు..అని నేనంటా.... ఇంకోళ్లంటే కొడ‌తా ... ఏ ముహూర్తాన మామా ఎక్ పెగ్ లా అని రాసావే కానీ క‌డుపు త‌రుక్కుపోయిందంటూ బాల‌య్య చేసిన ర‌చ్చ అంతా ఇంతా కాదు.

ఇక చార్మీ గురించి మాట్లాడుతూ ` `అల్ల‌రి పిడుగు` మూవీ టైమ్ లో అల్ల‌రి పిడుగులా వుంటే ఇప్పుడు పిడుగులా త‌యార‌య్యావ‌ని అన్నారు. ఇక పూరి, చార్మీల‌ని ఉద్దేశించి `నువ్వేమో ల‌య‌న్‌.. ఆ ఆమ్మాయేమో టైగ‌ర్.. మీ ఇద్ద‌రిని క‌లిపితే `లైగ‌ర్‌`... అన‌గానే రౌడీ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ ఎంట్రీ ఇచ్చారు. ఈ సంద‌ర్భంగా బాల‌య్య పంచె పైకి క‌ట్టేసి విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో బాక్సింగ్ చేయ‌డం అక్క‌డి వారిని న‌వ్వుల్లో ముంచేసింది. ఆ వెంట‌నే విజ‌య్ దేవ‌ర‌కొండ‌ని ఆలింగ‌నం చేసుకొని `స‌మ‌ర సింహారెడ్డి` వెల్క‌మ్స్ `అర్జున్‌రెడ్డి` అని వెల్క‌మ్ చెప్పారు.

`నువ్వు రౌడీ అయితే... నేను `రౌడీ ఇన్స్‌పెక్ట‌ర్‌`.. నువ్వు రౌడీ అని ఎలా ఫిక్స‌యిపోయావ్ అస‌లు` అని విజ‌య్‌ని ప్రశ్రించారు. దీనికి `చాలా సార్లు నాతో నువ్వు అది చేయొద్దు... ఇది చేయొద్దు లాంటి మాట‌లు విని పిస్తుండేవి.. వాటిని విన‌కుండా లేదు బై నేను చేస్తా.. అని డిసైడ్ అయ్యాను. ఆ త‌రువాత బాల‌య్య తానే స్వ‌యంగా విజ‌య్ దేవ‌ర‌కొండ‌కు, పూరికి, చార్మికి కొబ్బ‌రి బోండాలు కొట్టి ఇస్తూ సైడ్ బిజినెస్ బాగుంద‌య్యా అన్నాడు.

కొబ్బ‌రి బోండాం తీసుకున్న‌ చార్మి `బ్యాంకాక్ లో కొబ్బ‌రి బోండాల్లో ఓడ్కా క‌లిపి ఇస్తారు` అంది. అవన్నీ చేశాకే ఇక్క‌డికి వ‌చ్చి కూర్చున్నాం` అని బాల‌య్య అన‌డంతో అక్క‌డ న‌వ్వులు విరిసాయి. ఈ ఎపిసోడ్ సంక్రాంతికి `ఆహా`లో స్ట్రీమింగ్ కాబోతోంది.