Begin typing your search above and press return to search.

జాన్వీ కపూర్ ని పరిశీలిస్తున్న త్రివిక్రమ్ టీమ్..

By:  Tupaki Desk   |   30 March 2020 10:37 PM IST
జాన్వీ కపూర్ ని పరిశీలిస్తున్న త్రివిక్రమ్ టీమ్..
X
ఎన్టీఆర్-త్రివిక్రమ్ ల కాంబినేషన్లో వచ్చిన అరవింద సమేత సినిమా 2018 సంవత్సరంలోని బ్లాక్ బస్టర్ లలో ఒకటి. అరవింద సమేత ఎంతటి ఘనవిజయాన్ని సాధించిందో.. అందరికి తెలిసిందే. మాటల మాంత్రికుడు ఎన్టీఆర్ కలిస్తే ఆ మ్యాజిక్ వేరు. ఎన్టీఆర్ నుండి కొత్తరకం బాడీ లాంగ్వేజ్, డైలాగ్స్ పలికించిన ఘనత త్రివిక్రమ్ కి చెందుతుంది. ఆ సినిమా తర్వాత ఎన్టీఆర్ రాజమౌళి 'ఆర్ఆర్ఆర్' సినిమాతో బిజీ అయిపోయాడు. త్రివిక్రమ్ అల్లు అర్జున్ తో కలిసి 'అల వైకుంఠపురంలో' సినిమా తో ఈ ఏడాది సంక్రాంతికి భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు.

అయితే త్రివిక్రమ్ తదుపరి సినిమా ఎన్టీఆర్ తోనే తెరకెక్కించనున్నాడు. ఎన్టీఆర్ కూడా ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తి చుపిస్తున్నాడట. వచ్చే ఏడాది విడుదల సమ్మర్ లో విడుదల కానున్న ఈ సినిమాకు 'అయినను పోయిరావలె హస్తినకు' అనే టైటిల్ ఖరారు చేశారు చిత్రబృందం. అయితే ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లు అవసరం అవుతారట. ఒక హీరోయిన్ గా పూజ హెగ్డేను అనుకుంటున్నారట. ఎందుకంటే అరవింద సమేతలో ఎన్టీఆర్ తో కెమిస్ట్రీ బాగా కుదిరింది. పూజ మరోసారి జతకడితే త్రివిక్రమ్ తో వరుసగా మూడోసారి అవుతుంది. ఇంకో హీరోయిన్ గా శ్రీదేవి కూతురు బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ ని అనుకుంటున్నారట. అయితే ఈ వార్తకు సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. కొంత కాలం ఆగాలి మరి.