Begin typing your search above and press return to search.

బద్ధ శత్రువులు కలిసి నటిస్తున్నారు

By:  Tupaki Desk   |   19 Nov 2015 11:00 PM IST
బద్ధ శత్రువులు కలిసి నటిస్తున్నారు
X
ఒకే టైంలో టాప్ హీరోయిన్ లుగా కొనసాగిన ఇద్దరు హీరోయిన్లు నేరుగా గొడవ పడాల్సిన పని లేదు. వాళ్లిద్దరి మధ్య ప్రచ్ఛన్న యుద్ధం కొనసాగతూనే ఉంటుంది. అలాంటి వైరం త్రిష - నయనతారల మధ్య ఎప్పట్నుంచో ఉంది. వీళ్లిద్దరికీ ఒకరంటే ఒకరికి పడదని చాలామంది అంటారు. ట్విట్టర్ లో వీళ్లిద్దరి ఫ్యాన్స్ మధ్య కూడా అప్పుడప్పుడూ మాటల యుద్ధం నడుస్తుంటుంది. వీళ్లిద్దరి మధ్య వైరం నిజం అనడానికి రుజువుగా ఇద్దరూ ఎప్పుడూ కలిసి కనిపించరు. ఇండస్ట్రీలో ఇద్దరికీ వేరే హీరోయిన్లతో మంచి ఫ్రెండ్ షిప్పే ఉంది. కానీ ఇద్దరూ మాత్రం ఎప్పుడూ క్లోజ్ గా మూవైంది లేదు. కొన్నిసార్లు ఒకరి అవకాశాల్ని ఒకరు తన్నుకుపోయినట్లు కూడా వార్తలొచ్చాయి. అందుకే ఇద్దరినీ బద్ధ శత్రువులుగా భావిస్తారు తమిళ జనాలు.

అలాంటి ఇద్దరినీ కలిపి ఓ సినిమా తీయడానికి రెడీ అవుతున్నాడు డైరెక్టర్ విఘ్నేష్ శివన్. ఇతను నయనతార కొత్త ప్రియుడన్న సంగతి తెలిసిందే. ఇటీవలే నయన్, విజయ్ సేతుపతి కాంబినేషన్ లో ‘నానుమ్ రౌడీ దా’ అనే సూపర్ హిట్ సినిమా తీసిన విఘ్నేష్.. తన తర్వాతి సినిమాను నయన్ - విజయ్ సేతుపతి - త్రిషల కాంబినేషన్ లో తీయాలని ఆశపడుపడుతున్నాడు. ఈ సినిమా విషయంలో నయనే కొంచెం బెట్టు చేసిందని.. విఘ్నేష్ ఆమెను ఒప్పించి సినిమాను త్వరలోనే సెట్స్ మీదికి తీసుకెళ్తున్నాడని సమాచారం. ఈ ముక్కోణపు ప్రేమకథకు ‘పోర పోక్కుల రెండు కాదల్’ అనే టైటిల్ అనుకుంటున్నారు.