Begin typing your search above and press return to search.

తలైవా కోసం త్రిష తల్లి రాయబారం

By:  Tupaki Desk   |   13 April 2018 9:15 AM GMT
తలైవా కోసం త్రిష తల్లి రాయబారం
X
సూపర్ స్టార్ రజనికాంత్ ఎన్నడూ లేనిదీ మొదటిసారి రెండు సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉంచడంతో పాటు మరో సినిమా షూటింగ్ ను త్వరలోనే ప్రారంభించబోతున్న సంగతి తెలిసిందే. కాలా జూన్ కు పోస్ట్ పోన్ కాగా 2.0 ఎప్పుడు విడుదల అవుతుందో లైకా సంస్థకు కూడా క్లారిటీ లేదు. ఈ రోజు విడుదలైన మెర్క్యూరీ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ తో రజని ఓ సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం ఇప్పటికే సంచలనంగా మారింది. నాలుగు సినిమాల అనుభవమున్న కార్తిక్ సుబ్బరాజ్ టేకింగ్ కి ఫిదా అయిన రజని కోరి మరీ ఛాన్స్ ఇచ్చినట్టుగా కోలీవుడ్ టాక్. ప్రస్తుతం ఆ సినిమాకు సంబంధించిన టెక్నీషియన్స్ యాక్టర్స్ ని ఫైనల్ చేసే పనిలో ఉన్నాడు కార్తిక్ సుబ్బరాజ్. అందులో నటించే అవకాశం కోసం ఒక హీరొయిన్ తెగ ట్రై చేస్తోందని అక్కడి మీడియా టాక్.

దశాబ్దానికి పైగా సౌత్ సినిమాల్లో నటిస్తూ అందరు అగ్ర హీరోల సరసన నటించిన త్రిషా ఒక్క రజనికాంత్ తో మాత్రం చేయలేకపోయింది. శ్రేయ ఆ లోటు శివాజీతో నెరవేర్చుకోగా ఐశ్వర్యరాయ్ కూడా రోబోతో ఆ కోరిక తీర్చేసుకుంది. కాని త్రిషను మాత్రం అవకాశం వరించలేదు. చిరంజీవి-కమల్ హాసన్-బాలకృష్ణ-వెంకటేష్-నాగార్జున-విజయ్-విక్రం ఇలా స్టార్ హీరోలందరితో ఆడి పాడిన త్రిషకు ఆ లోటు మాత్రం అలాగే మిగిలిపోయింది. అందుకే కార్తీక్ సుబ్బరాజ్ సినిమాలో ఎలాగైనా అవకాశం దక్కించేలా త్రిషా తల్లి స్వయంగా రంగంలోకి దిగినట్టు టాక్. తమకు బాగా సన్నిహితుడైన విజయ్ సేతుపతి ద్వారా రాయబారం జరుగుతున్నట్టు సమాచారం. విజయ్ సేతుపతి ఆ సినిమాలోనే విలన్ గా ఎంపికయ్యాడు. సెన్సేషనల్ కాంబోగా ఇప్పటికే హైప్ తెచ్చుకున్న ఈ మూవీ కొబ్బరి కాయ కొట్టే లోపు ఇంకెన్ని విశేషాలు మూటగట్టుకుంటుందో చూడాలి.