Begin typing your search above and press return to search.

ట్రెండింగ్: NC 20 డైరెక్ట‌ర్ ఫిక్స్

By:  Tupaki Desk   |   23 Nov 2019 10:29 AM GMT
ట్రెండింగ్: NC 20 డైరెక్ట‌ర్ ఫిక్స్
X
ఏడాదిన్న‌ర కాలంగా ద‌ర్శ‌కుడు ప‌ర‌శురామ్ లో డైల‌మా గురించి తెలిసిందే. ఓవైపు మ‌హేష్ కి క‌థ చెబుతున్నాడ‌ని లేదు అక్కినేని హీరోల‌కు షిఫ్ట‌య్యాడ‌ని ర‌క‌ర‌కాలుగా ప్ర‌చార‌మైంది. అయితే ఎవ‌రితోనూ మూవీ క‌న్ఫామ్ అయ్యింది అన్న వార్త అయితే లేదు. ఇదిగో పులి అంటే అదిగో మేక! అన్న‌ చందంగా త‌యారైంది స‌న్నివేశం. దీంతో అస‌లు ప‌ర‌శురామ్ ఎప్ప‌టికి ఆ శుభ‌వార్త చెబుతాడు? గీత గోవిందం లాంటి బ్లాక్ బ‌స్ట‌ర్ తీసి ఇంత‌కాలం వెయిట్ చేయాలా? అంటూ అభిమానుల‌ క‌ల‌త చెందారు. ఎట్ట‌కేల‌కు ఆ క‌ల‌త తీరే స‌మ‌యం ఆస‌న్న‌మైంది.

ప‌ర‌శురామ్ నుంచి మ‌రో క్లాసిక్ సినిమా రాబోతోంద‌ని ఫ్యాన్స్ ఫిక్స్ అవ్వొచ్చు. ఇప్ప‌టికే అక్కినేని నాగ‌చైత‌న్య‌కు క‌థ వినిపించాడు. పూర్తి స్క్రిప్టు ను వినిపించేసేందుకు రెడీ అవుతున్నాడు. ఈ సినిమా 2020 మేలో ప్రారంభం కానుంది. 14 రీల్స్ ప్ల‌స్ సంస్థ అత్యంత ప్ర‌తిష్ఠాత్మ‌కంగా ఈ చిత్రాన్ని నిర్మించ‌నుంది. ఇక ఈ సినిమాలో క‌థానాయిక ఎవ‌రు.. ఇత‌ర కాస్టింగ్ ఎవ‌రు ఉంటారు? అన్న‌ది తెలియాల్సి ఉంది.

నాగ‌చైత‌న్య న‌టించిన వెంకీమామ డిసెంబ‌ర్ 13న రిలీజ‌వుతోంది. శేఖ‌ర్ క‌మ్ములతో NC19 చిత్రాన్ని 2020లో రిలీజ్ చేస్తున్నారు. దీనిపై ఓ క్లారిటీ వ‌చ్చేసే క్ర‌మంలోనే ప‌ర‌శురామ్ తో సెట్స్ కెళ్లేందుకు చైతూ ప్లాన్ చేశాడ‌ని తెలుస్తోంది. ప్ర‌స్తుతం ప‌ర‌శురామ్ NC20 స్క్రిప్టును ఫైన‌ల్ చేసే ప‌నిలో ఉన్నాడు. ఇది రెడీ అవ్వ‌గానే అత‌డు ప్రీప్రొడ‌క్ష‌న్ కూడా ప్రారంభించేస్తాడ‌ట‌. 14 రీల్స్ ప్ల‌స్ తో సినిమాకి ద‌ర్శ‌క‌ హీరోల‌కు భారీగానే పారితోషికాలు అందుతున్నాయ‌న్న స‌మాచారం ఉంది.