Begin typing your search above and press return to search.

ది బెస్ట్‌ అనిపించుకోవడానికి దేవిశ్రీ తంటాలు.. ఆపై విమర్శలు

By:  Tupaki Desk   |   7 Aug 2021 10:30 AM GMT
ది బెస్ట్‌ అనిపించుకోవడానికి దేవిశ్రీ తంటాలు.. ఆపై విమర్శలు
X
టాలీవుడ్‌ రాక్ స్టార్‌ దేవిశ్రీ ప్రసాద్‌ సుదీర్ఘ కాలంగా టాప్ స్టార్‌ మ్యూజిక్ డైరెక్టర్ గా దూసుకు పోతూ ఉన్నాడు. ఇప్పటికి కూడా ఆయన మ్యూజిక్‌ ఆల్బమ్స్ కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే ఈమద్య కాలంలో అల వైకుంఠపురంలో వంటి బిగ్గెస్ట్‌ మ్యూజిక్‌ బ్లాక్‌ బస్టర్‌ ను ఇచ్చి థమన్‌ వార్తల్లో నిలిచాడు. ఏడాది పాటు ట్రెండ్‌ అయ్యేలా అల వైకుంఠపురంలో సినిమా పాటలను థమన్‌ ఇచ్చాడు. దాంతో ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా థమన్‌ మాట పాట వినిపిస్తున్నాయి. అందుకే దేవిశ్రీ ప్రసాద్‌ తన మార్క్ ను ఉపయోగించి టాలీవుడ్‌ లో తన మోత మ్రోగేలా ప్లాన్‌ చేస్తున్నాడు. అందుకోసం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నాడు.

ఉప్పెన సినిమాలోని పాటలు ది బెస్ట్ గా నిలిచాయి. అయినా కూడా అంతకు మించి ఉండాలని ఈసారి అల్లు అర్జున్ తీవ్రంగా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడని తెలుస్తోంది. ది బెస్ట్‌ గా ప్రతి పాట ఉండాలనే ఉద్దేశ్యంతో దేవి శ్రీ ప్రసాద్‌ తంటాలు పడుతున్నాడు. ప్రస్తుతం దేవిశ్రీ ప్రసాద్‌ పుష్ప తో పాటు మరి కొన్ని సినిమాలకు సంగీతాన్ని అందిస్తున్నాడు. పుష్ప నుండి మొదటి సాంగ్ రాబోతుంది. ఆ పాట ఇతర రికార్డ్‌ లు అన్ని కూడా బద్దలు చేసేలా ఉండబోతుంది అంటూ చాలా నమ్మకంగా ఉన్నారు. ఖచ్చితంగా దేవి శ్రీ ప్రసాద్‌ ఆ పాటను కసితో చేసి ఉంటాడు కనుక ఖచ్చితంగా ఆకట్టుకుంటుందని అల్లు అర్జున్‌ ఫ్యాన్స్‌ తో పాటు అందరు అనుకుంటున్నారు.

దేవిశ్రీ ప్రసాద్‌ ది బెస్ట్‌ ఇవ్వాలనే పట్టుదలతో చాలా టైమ్ తీసుకుంటున్నాడు అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఔట్‌ పుట్‌ ను సరైన సమయంకు ఇవ్వకపోతే సినిమా మేకర్స్ కు సమస్యలు ఉంటాయి. దేవిశ్రీ ప్రసాద్‌ చాలా తిప్పుకుంటున్నాడని.. చెప్పిన టైమ్‌ కు ట్యూన్స్ కాని.. ఆర్‌ ఆర్ కాని ఇవ్వడం లేదని కొందరు నిర్మాతలు కంప్లైంట్ చేస్తున్నారు. ది బెస్ట్‌ ఇవ్వాలనుకోవడం సబబె కాని ఆలస్యం చేయడం వల్ల నిర్మాతలు చాలా నష్టపోవాల్సి వస్తుందని.. అందుకే దేవి శ్రీ ప్రసాద్‌ ది బెస్ట్‌ సాంగ్స్ ను ఇవ్వడంతో పాటు సరైన సమయంకు కూడా ఇవ్వాలని అభిమానులు కోరుకుంటున్నారు.

ప్రస్తుతం సర్కారు వారి పాట సినిమా కోసం పాటలను రెడీ చేస్తున్న థమన్‌ ఈసారి కూడా అల వైకుంఠపురంలో తరహా మ్యూజికల్‌ హిట్‌ ఖాయం అన్నట్లుగా అభిమానుల్లో అంచనాలు పెంచుతున్నాడు. మహేష్‌ బాబు పుట్టిన రోజు సందర్బంగా థమన్‌ నుండి సర్కారు వారి పాట మొదటి పాట విడుదలకు సిద్దం అయ్యింది. ఇదే సమయంలో అల్లు అర్జున్‌ సినిమా పుష్ప నుండి కూడా మొదటి పాట రాబోతున్న నేపథ్యంలో ఏది బెస్ట్‌ గా ఉంటుందా అంటూ ఇద్దరు హీరోల అభిమానులు ఆసక్తిగా ఉంటున్నారు. యూట్యూబ్‌ వ్యూస్‌ రికార్డ్‌ కోసం ఇద్దరు హీరోల అభిమానులు ఎదురు చూస్తున్నారు.