Begin typing your search above and press return to search.

టాలీవుడ్ వెట‌ర‌న్ న‌టుడు పొట్టి వీరయ్య మృతి

By:  Tupaki Desk   |   25 April 2021 5:09 PM GMT
టాలీవుడ్ వెట‌ర‌న్ న‌టుడు పొట్టి వీరయ్య మృతి
X
సుమారు 500 కి పైగా తెలుగు సినిమాల్లో కీలకమైన అతిథి పాత్రలను పోషించిన‌ ప్రముఖ తెలుగు నటుడు పొట్టి వీరయ్య హైదరాబాద్ లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో తుది శ్వాస విడిచారు. తాజా స‌మాచారం ప్రకారం.. గత కొన్ని సంవత్సరాలుగా థెస్పియన్ ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న అత‌డికి.. ఈ ఉదయం హార్ట్ స్ట్రోక్ వచ్చిన తరువాత ఆసుపత్రిలో చేరాడు. దురదృష్టవశాత్తు.. ఆదివారం (25 ఏప్రిల్) సాయంత్రం కన్నుమూశారు కుటుంబ సభ్యుల వివ‌రాల ప్ర‌కారం.. అతని చివరి కర్మలు సోమవారం నాడు జరుగుతాయి.

తెలంగాణలోని సూర్యాపేట జిల్లాలోని ఫానిగిరి గ్రామానికి చెందిన గట్టు వీరయ్య చిన్నప్పటి నుంచీ రంగస్థల క‌ళాకారుడు. నాటకాల్లో న‌టిస్తూ సినీప‌రిశ్ర‌మ వైపు ఆకర్షితుడయ్యాడు. నటుడిగా ఎదగాలని ఆకాంక్షించిన అతను చెన్నైలో అడుగుపెట్టాడు. ప్రారంభ రోజుల్లో, అతను పూల దుకాణంలో పనిచేశాడు. అది కూడా సినిమా సెట్లలో అలంకరణలు చేసేవాడు. వీరయ్య మరగుజ్జు కావడంతో సీనియర్ హీరో శోభన్ బాబు తమ చిత్రాలలో తగిన పాత్రల కోసం బి విట్టలచార్య వంటి దర్శకులను కలవమని సలహా ఇచ్చారు.

ఆ తరువాత విట్టలచార్య 1967 చిత్రం `అగ్గి దొర‌`లో వీర‌య్య‌ నటించాడు .. రాధమ్మ పెళ్లి- జగన్మోహిని- యుగంధర్- గ‌జ‌దొంగ త‌దిత‌ర చిత్రాల్లో ఇతరులలో నటించాడు. తెలుగు- తమిళం- కన్నడ- మలయాళ భాషల్లో 500 కి పైగా చిత్రాల్లో నటించారు. తన ప్రారంభ రోజుల్లో క‌మెడియ‌న్ రాజబాబు .. దాసరి నారాయణరావు తనను ఎంతో ప్రోత్సహించారని ఒక ఇంటర్వ్యూలో ఆయన వెల్లడించారు.

పొట్టి వీరయ్య భార్య మల్లికా 2008 లో కన్నుమూశారు. అతనికి ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. తెలుగు సినిమాకు చెందిన పలువురు ప్రముఖులు తమ సంతాపం తెలిపారు.