Begin typing your search above and press return to search.

టాలీవుడ్ డ్రగ్స్ కేసు: రవితేజను 6 గంటల పాటు విచారించిన ఈడీ..!

By:  Tupaki Desk   |   9 Sep 2021 11:22 AM GMT
టాలీవుడ్ డ్రగ్స్ కేసు: రవితేజను 6 గంటల పాటు విచారించిన ఈడీ..!
X
టాలీవుడ్ డ్రగ్స్ కేసులో రంగంలోకి దిగిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ).. విచారణ వేగవంతం చేసింది. మాధకద్రవ్యాల వ్యవహారాల్లో మనీ లాండరింగ్ జరిగిందనే కోణంలో పలువురిని విచారిస్తోంది. ఇందులో భాగంగా ఈరోజు గురువారం హీరో రవితేజ ఈడీ విచారణకు హాజరయ్యారు. ఆయన వ్యక్తిగత డ్రైవర్ శ్రీనివాస్ ను కూడా ఈడీ అధికారులు ఇవాళ ప్రశ్నించారు. ఉదయం నుంచి దాదాపు 6 గంటల పాటు సాగిన ఈ విచారణ ముగిసింది.

మనీ లాండరింగ్ కోణంలో రవితేజ బ్యాంకు లావాదేవీలను ఈడీ అధికారులు పరిశీలించారను తెలుస్తోంది. ఈ క్రమంలో అనుమానాస్పద ట్రాన్సక్షన్స్ గురించి అధికారులు ఆరా తీసినట్టు సమాచారం. డ్రగ్స్ పెడ్లర్ కెల్విన్ తో పరిచయం ఉందా?.. అతని అకౌంట్ కు ఆర్థిక లావాదేవీలు జరిపారా? అనే విషయాల మీద రవితేజ ను ప్రశ్నించారని తెలుస్తోంది. అలానే ఎఫ్ క్లబ్ గురించి కూడా అధికారులు అడిగినట్లు సమాచారం.

రవితేజ తో పాటుగా డ్రైవర్ శ్రీనివాస్ ను కూడా ఈడీ విచారించింది. కెల్విన్ స్నేహితుడు బీషన్ అలీఖాన్ ను కూడా అధికారులు ప్రశ్నించారని తెలుస్తోంది. డ్రగ్స్ వ్యవహారంలో ఇప్పటికే పూరీ జగన్నాథ్ - ఛార్మి కౌర్ - రకుల్ ప్రీత్ సింగ్ - నందు - రానా దగ్గుబాటి లను ఈడీ విచారించింది. నవదీప్ - ముమైత్ ఖాన్ - తనీష్ - తరుణ్ లను రానున్న రోజుల్లో అధికారులు ప్రశ్నించనున్నారు.