Begin typing your search above and press return to search.

సైమా లో మెరిసిన తెలుగు సైన్మా

By:  Tupaki Desk   |   8 Aug 2015 10:41 AM IST
సైమా లో మెరిసిన తెలుగు సైన్మా
X
కధానాయకుల కుర్ర జోకులు, అందాల రాశుల ఆఫ్ స్క్రీన్ ఎపియరెన్స్ లు, ఎక్కడకెళ్ళినా మర్కట బుద్ధిని వదులుకోలేని తుంటరి బ్యాచ్ లు... ఇవన్నీ ఒకే వేదికపై జరుగుతుంటే సినీ ప్రియుడికి చూడ్డానికి రెండు కళ్ళూ సరిపోతాయా? అచ్చు అలానే అంగరంగ వైభవంగా దుబాయ్ లో సైమా అవార్డుల ప్రదానోత్సవం జరిగింది. ఈ వేడుకలో భాగంగా తెలుగు సినీ తారలు ఉల్లాసంగా కార్యక్రమాలలో పాల్గున్నారు.

విక్టరీ వెంకటేష్, నందమూరి బాలకృష్ణ కలిసి ఉషా ఉతుప్ తో స్టేజ్ మీద పాటలు పాడి, చిన్న సైజు స్టెప్పులు వేశారు. వీరికి తోడుగా నటి కుష్బు, ప్రస్తుత తరం హాట్ బ్యూటీ శృతిహాసన్ జతకట్టడం విశేషం.

మూవీ మొఘల్ రామానాయుడు గారి జ్ఞాపకార్ధం విడుదల చేసిన జ్ఞాపికను రానా, నాగ చైతన్య అందుకున్నారు.

వివిధరంగాలలో బాలకృష్ణ, రాశీఖన్నా, బ్రహ్మానందం, చంద్రబోస్, సుజీత్, థమన్ లు పురస్కారాలు అందుకున్నారు.

అయితే నాణానికి మరోవైపు సైమాకి వచ్చిన చిన్న ఆర్టిస్టులను అక్కడ నిర్వాహుకులు అగౌరవపరిచారని ఇంటర్నెట్ సంచలనం సంపూర్ణేష్ బాబు ట్విట్టర్ లో వెల్లడించారు.