Begin typing your search above and press return to search.

ఎన్టీఆర్ - కొర‌టాల మూవీకి టైమ్ ఫిక్స్‌!

By:  Tupaki Desk   |   20 Dec 2021 12:30 PM GMT
ఎన్టీఆర్ - కొర‌టాల మూవీకి టైమ్ ఫిక్స్‌!
X
యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ న‌టించిన ప్రెస్టీజియ‌స్ మూవీ `ఆర్ ఆర్ ఆర్‌`. భారీ అంచ‌నాల మ‌ధ్య ఈ చిత్రం జ‌న‌వ‌రి 7న ప్ర‌పంచ వ్యాప్తంగా దాదాపు 14న భాష‌ల్లో విడుద‌ల‌వుతున్న విష‌యం తెలిసిందే. ఈ మూవీ ప్ర‌చార కార్య‌క్ర‌మాల్లో ఫుల్ జోష్ తో పాల్గొంటున్నారు యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌. ఈ మూవీ త‌రువాత ఆయ‌న న‌టించ‌నున్న భారీ చిత్రం మార్చిలో సెట్స్ పైకి రాబోతోంది. ఎన్టీఆర్ 30వ చిత్రంగా తెర‌పైకి రానున్న ఈ చిత్రాన్ని స్టార్ డైరెక్ట‌ర్ కొర‌టాల శివ తెర‌కెక్కించ‌బోతున్నారు.

ఈ భారీ చిత్రాన్ని యువ సుధా ఆర్ట్స్ , ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యాన‌ర్స్ పై సుధాక‌ర్ మిక్కిలినేని, హీరో నందమూరి క‌ల్యాణ్‌రామ్ నిర్మించనున్నారు. ఈ ప్రాజెక్ట్ ని ఈ ఏడాది ఏప్రిల్ లో అధికారిక‌గా మేక‌ర్స్ ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే.

`ఆర్ ఆర్ ఆర్‌` చిత్రీక‌ర‌ణ ఆల‌స్యం కావ‌డం వ‌ల్ల ఈ ప్రాజెక్ట్ కూడా ఆల‌స్య‌మ‌వుతూ వ‌స్తోంది. అంతే కాకుండా డైరెక్ట‌ర్ కొర‌టాల శివ `ఆచార్య‌` చిత్రీక‌ర‌ణ లో వుండ‌టం .. కోవిడ్ కార‌ణంగా ఈ మూవీ షూటింగ్ కూడా ఆలస్యం కావ‌డంతో ఎన్టీఆర్ సినిమా ప‌ట్టాలెక్క‌డానికి బ్రేకులు ప‌డ్డాయి.

`జ‌న‌తా గ్యారేజ్‌` చిత్రంతో తొలి కాంబినేష‌న్ లోనే బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ ని సొంతం చేసుకున్న కొర‌టాల శివ‌- ఎన్టీఆర్ ల క‌ల‌యిక‌లో రానున్న ద్వితీయ చిత్రం కావ‌డంతో ఈ చిత్రం ప్ర‌క‌టన వెలువ‌డిన ద‌గ్గ‌రి నుంచే దీనిపై అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి.

అంతే కాకుండా ఈ సారి అంత‌కు మించి పాన్ ఇండియా లెవెల్ మూవీతో మీ ముందుకు రానున్నామ‌ని ద‌ర్శ‌కుడు కొరటాల శివ హింట్ ఇవ్వ‌డంతో ఈ చిత్రం ఈ సారి`జ‌న‌తా గ్యారేజ్` కి మించి వుంటుంద‌ని అంచ‌నాలు వేయ‌డం మొద‌లైంది.

అయితే ఈ మూవీ రెగ్యుల‌ర్ షూటింగ్ ఎప్పుడెప్పుడు మొద‌ల‌వుతుందా అని చాలా రోజులుగా ఎదురు చూస్తున్న అభిమానుల‌కు మేక‌ర్స్ నుంచి గుడ్ న్యూస్ వ‌చ్చేసింది.

ఈ చిత్ర రెగ్యుల‌ర్ షూటింగ్ ని మార్చి నుంచి మేక‌ర్స్ ప్రారంభించ‌బోతున్నారు. భారీ బ‌డ్జెట్ తో అత్యంత ప‌వ‌ర్‌ఫుల్ స్టోరీతో ఈ మూవీని కొర‌టాల శివ తెర‌కెక్కిచ‌నున్న ఈమూవీ పాన్ ఇండియా లెవెల్లో హాట్ టాపిక్ గా నిల‌వ‌డం ఖాయం అని ఇండ‌స్ట్రీలో అప్పుడే చ‌ర్చ కూడా మొద‌లైంది.

ఇదిలా వుంటే ఇందులో ఎన్టీఆర్ స‌ర‌స‌న `పెళ్లిసంద‌D` ఫేమ్ శ్రీలీల క‌నిపించే అవ‌కాశాలు వున్నాయంటూ వార్త‌లు వినిపిస్తున్నాయి. కియారా అద్వానీ మెయిన్ హీరోయిన్ గా న‌టిస్తుంద‌ని, సెకండ్ హీరోయిన్ గా శ్రీ‌లీల క‌నిపిస్తుంద‌ని చెబుతున్నారు. ఈ వార్త‌ల్లో నిజ‌మెంత అన్న‌ది తెలియాలంటే మేక‌ర్స్ అఫీషియ‌ల్ గా ప్ర‌క‌టించే వ‌ర‌కు వేచి చూడాల్సిందే.