Begin typing your search above and press return to search.

మెగా మేనల్లుడి కెరీర్ ప్లానింగ్ మాములుగా లేదుగా...!

By:  Tupaki Desk   |   28 May 2020 1:30 AM GMT
మెగా మేనల్లుడి కెరీర్ ప్లానింగ్ మాములుగా లేదుగా...!
X
మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ వరుస సినిమాలను లైన్లో పెడుతూ దూకుడు చూపిస్తున్నాడు. 'ప్రతీరోజూ పండగే' సినిమా అందించిన జోష్ ని కొత్త ప్రాజెక్ట్స్ ఓకే చేయడంలో చూపిస్తున్నాడు. ప్రస్తుతం సాయి ధరమ్ తేజ్ 'సోలో బ్రతుకే సో బెటర్' అనే చిత్రంలో నటిస్తున్నారు. సుబ్బు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని బీవీఎస్.యన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో నభా నటేష్ హీరోయిన్ గా నటిస్తోంది. చిత్రీకరణ దశలో ఉన్న ఈ సినిమాను సమ్మర్ లో రిలీజ్ చేయాలని భావించారు. కానీ దేశవ్యాప్తంగా ఏర్పడిన పరిస్థితుల వల్ల వాయిదా పడింది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్ సినిమాపై అంచనాలు పెంచేసింది. ఈ సినిమా తర్వాత సాయి ధరమ్ తేజ్.. 'ప్రస్థానం' దేవకట్టా దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్నాడు. ఈ సినిమాలో తేజ్ క్యారెక్టర్ చాలా భిన్నంగా ఉంటుందని.. ఇప్పటి వరకు ఆయన కెరీర్లో ట్రై చేయని జోనర్ అని తెలుస్తోంది. నటుడిగా ఇది మెగా మేనల్లుడి మరో స్థాయికి తీసుకుపోయే సినిమా అవుతుందని ఇప్పటికే డైరెక్టర్ దేవాకట్టా వెల్లడించారు. పవన్ కళ్యాణ్ చేతులు మీదుగా లాంఛ‌నంగా ప్రారంభ‌మైన ఈ చిత్రాన్ని జె.బి.ఎంటర్టైన్మెంట్స్ బ్యాన‌ర్‌ పై జె.భగవాన్ - జె.పుల్లారావు నిర్మిస్తున్నారు. ఈ క్రమంలో మెగా సుప్రీమ్ హీరో మరో సినిమా ఓకే చేసాడని గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. స్టైలిష్ డైరెక్టర్ సుకుమార్ వద్ద అసిస్టెంట్ గా పని చేసిన వ్యక్తి ఈ చిత్రానికి డైరెక్షన్ చేయబోతున్నాడట. అయితే ఈ సినిమాని ముగ్గురు నిర్మాతలు కలిసి నిర్మించబోతున్నారట. టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్స్ దిల్ రాజు బీవీఎస్.యన్ ప్రసాద్ మరియు వైష్ణో కృష్ణ కలిసి సంయుక్తంగా తేజ్ తో సినిమా తీయబోతున్నారట. ఇప్పటికే స్టోరీ లైన్ తేజ్ కి నచ్చిందని.. ఇండస్ట్రీలో పరిస్థితులు చక్కబడిన వెంటనే ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ స్టార్ట్ అవుతాయని ఇండస్ట్రీ వర్గాలు అనుకుంటున్నాయి.

ఇదిలా ఉండగా మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడిగా 'రేయ్' అనే సినిమాతో ఇండస్ట్రీలో అడుగుపెట్టాలనుకున్నాడు సాయి ధరమ్ తేజ్. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల 'పిల్లా నువ్వులేని జీవితం' సినిమా మొదటగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కెరీర్ స్టార్టింగ్ లో వరుస విజయాలను చూసిన తేజ్.. ఆ తర్వాత అర డజన్ ఫ్లాపులను చవి చూసాడు. 'పిల్లా నువ్వులేని జీవితం' 'సుబ్రహ్మణ్యం ఫర్ సేల్' 'సుప్రీమ్' సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అదే విధంగా 'తిక్క' 'విన్నర్' 'నక్షత్రం' 'జవాన్' 'ఇంటెలిజెంట్' 'తేజ్ ఐ లవ్ యూ' లాంటి ఘోర పరాజయాలను కూడా మూటగట్టుకున్నాడు. అయితే హిట్ ప్లాపులతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో తన మార్కెట్ పెంచుకునే ప్రయత్నం చేస్తూనే వస్తున్నాడు. ఈ నేపథ్యంలో కిషోర్ తిరుమల దర్శకత్వంలో వచ్చిన 'చిత్రలహరి' సినిమాతో బౌన్స్ బ్యాక్ అయ్యాడు తేజ్. ఆ తర్వాత వచ్చిన 'ప్రతీరోజూ పండగే' సినిమాతో మరో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. ఈ ఉత్సాహంతో తేజ్ ఇప్పుడు మరిన్ని సినిమాలను ప్లాన్ చేసుకుంటున్నాడు. మొత్తానికి రెండు వరుస విజయాలు వచ్చేసరికి కెరీర్లో నూతన ఉత్తేజంతో ముందుకు వెళ్తున్నాడు సాయి ధరమ్ తేజ్. మరి ఇప్పుడు ఓకే చేసిన సినిమాలతో తేజ్ తన విజయాలను కంటిన్యూ చేస్తాడేమో చూడాలి.