Begin typing your search above and press return to search.

మెగా మేనల్లుడి సోలో బ్రతుకు సో బెటర్ గా ఉండబోతోందా...?

By:  Tupaki Desk   |   7 May 2020 11:50 AM GMT
మెగా మేనల్లుడి సోలో బ్రతుకు సో బెటర్ గా ఉండబోతోందా...?
X
మెగా మేనల్లుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టి వరుస సినిమాలతో తనకంటూ ప్రత్యేక మార్కెట్ సృష్టించుకున్న హీరో సాయి ధరమ్ తేజ్. కెరీర్ స్టార్టింగ్ లో వరుస విజయాలను చూసిన తేజ్.. ఆ తర్వాత అర డజన్ ఫ్లాపులను చవి చూసాడు. ఈ నేపథ్యంలో 'చిత్రలహరి' సినిమాతో బౌన్స్ బ్యాక్ అయ్యాడు. ఆ తర్వాత వచ్చిన 'ప్రతీరోజూ పండగే' సినిమాతో మరో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. ఈ రెండు సినిమాలు ఇచ్చిన ఉత్సాహంతో తేజ్ ఇప్పుడు మరిన్ని సినిమాలకు కమిట్ అవుతున్నాడు. ప్రస్తుతం సాయి ధరమ్ తేజ్ 'సోలో బ్రతుకే సో బెటర్' అనే చిత్రంలో నటిస్తున్నారు. సుబ్బు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని బీవీఎస్.యన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో నభా నటేష్ హీరోయిన్ గా నటిస్తోంది. చిత్రీకరణ దశలో ఉన్న ఈ సినిమాను సమ్మర్ లో రిలీజ్ చేయాలని భావించారు. కానీ కరోనా ఎఫెక్ట్ వల్ల వాయిదా పడింది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్ సినిమాపై అంచనాలు పెంచేసింది.

'సోలో బ్రతుకే సో బెటర్' అనే టైటిల్ చూస్తేనే అర్థం అవుతుంది ఇది ఒక బ్యాచిలర్ స్టోరీ అని.. పెళ్లి అంటే ఇష్టం లేక సోలోగా ఉండటమే బెటర్ అని అనుకునే కుర్రాడి కథ అని తెలుస్తోంది. అయితే ఇదే స్టోరీని చాలా ఫన్నీగా చెప్పబోతున్నారని సమాచారం. ఈ సినిమాలో జబర్దస్త్ కమెడియన్ హైపర్ ఆది ఒక కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈ మధ్య ఒక ఇంటర్వ్యూలో 'సోలో బ్రతుకే సో బెటర్' సినిమాకి సంభందించి కొన్ని విశేషాలు చెప్పుకొచ్చాడు. ఈ సినిమా కాంటెంపరరీ ఇష్యూస్ మీద నడుస్తుందని.. అది కూడా హ్యూమర్ జెనెరేట్ చేస్తూ ఉంటుందని చెప్పుకొచ్చాడు. గతేడాది 'ప్రతిరోజూ పండగే'తో కామెడీ పండించిన తేజ్ ఇప్పుడు సోలోగా వచ్చి నవ్విస్తాడన్నమాట. ఈ చిత్రానికి థమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు. మరి ఈ సినిమాతో సాయి ధరమ్ తేజ్ తన విజయాల పరంపర కొనసాగిస్తాడేమో చూడాలి.

ఈ సినిమా తర్వాత సాయి ధరమ్ తేజ్ 'ప్రస్థానం' దేవకట్టా దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్నాడు. ఈ సినిమాలో తేజ్ క్యారెక్టర్ చాలా భిన్నంగా ఉంటుందని.. ఇప్పటి వరకు ఆయన కెరీర్లో ట్రై చేయని జోనర్ అని తెలుస్తోంది. నటుడిగా ఇది మెగా మేనల్లుడి మరో స్థాయికి తీసుకుపోయే సినిమా అవుతుందని.. కచ్చితంగా ఈ సినిమా చూసిన తర్వాత తేజ్ నటుడిగా మరింత పేరు తెచ్చుకుంటాడని ఇప్పటికే దేవాకట్టా వెల్లడించారు. లాంఛ‌నంగా ప్రారంభ‌మైన ఈ చిత్రాన్ని జె.బి.ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌ పై జె.భగవాన్ - జె.పుల్లారావు నిర్మిస్తున్నారు. లాక్ డౌన్ ఎత్తేసిన తర్వాత ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. మొత్తానికి రెండు వరుస విజయాలు వచ్చేసరికి కెరీర్లో నూతన ఉత్తేజంతో ముందుకు వెళ్తున్నాడు సాయి ధరమ్ తేజ్.