Begin typing your search above and press return to search.

త్రివిక్రమ్ హీరోయిన్లను ఎందుకు రిపీట్ చేస్తుంటాడు..??

By:  Tupaki Desk   |   13 July 2021 7:49 AM GMT
త్రివిక్రమ్ హీరోయిన్లను ఎందుకు రిపీట్ చేస్తుంటాడు..??
X
ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ డైరెక్టర్స్ లో త్రివిక్రమ్ శ్రీనివాస్ ఒకరు. రచయితగా ఇండస్ట్రీకి వచ్చిన త్రివిక్రమ్.. తన మాటలతో ఎన్నో సినిమాల విజయాలలో భాగం పంచుకున్నారు. ఈ క్రమంలో 'నువ్వే నువ్వే' సినిమాతో దర్శకుడి అవతారం ఎత్తారు. 'అతడు' 'జల్సా' 'ఖలేజా' 'జులాయి' 'అత్తారింటికి దారేది' 'సన్నాఫ్ సత్యమూర్తి' 'అ ఆ' 'అజ్ఞాతవాసి' 'అరవింద సమేత వీర రాఘవ' వంటి సూపర్ హిట్స్ అందుకున్న త్రివిక్రమ్.. 'ఖలేజా' 'అజ్ఞాతవాసి' వంటి ప్లాప్స్ కూడా రుచి చేసాడు. గతేడాది 'అల వైకుంఠపురములో' సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ని తన ఖాతాలో వేసుకున్నారు. రచయితగా దర్శకుడిగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న త్రివిక్రమ్.. తన సినిమాలలో హీరోయిన్లను రిపీట్ చేస్తుంటారు.

పవన్ కళ్యాణ్ తో తీసిన 'జల్సా' సినిమాలో హీరోయిన్ గా గోవా బ్యూటీ ఇలియానా నటించిందనే సంగతి తెలిసిందే. అయితే ఇందులో అమ్మడి పెరఫార్మన్స్ నచ్చి అల్లు అర్జున్ తో రూపొందించిన 'జులాయి' చిత్రంలో మళ్ళీ ఇల్లీ బేబీ ని హీరోయిన్ గా తీసుకున్నారు త్రివిక్రమ్. అలానే పవన్ తో చేసిన 'అత్తారింటికి దారేది' చిత్రంలో స్టార్ హీరోయిన్ సమంత అక్కినేని నటన మెచ్చిన దర్శకుడు.. బన్నీ 'సన్నాఫ్ సత్యమూర్తి' - నితిన్ 'అ ఆ' చిత్రాల్లో సామ్ నే హీరోయిన్ గా రిపీట్ చేశాడు. ప్రస్తుతం బుట్టబొమ్మ పూజాహెగ్డే పెరఫార్మన్స్ నచ్చడంతో త్రివిక్రమ్ ఈ బ్యూటీకి వ‌రుస అవ‌కాశాలు ఇస్తున్నాడు.

ఎన్టీఆర్ - త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో తెరకెక్కిన 'అరవింద సమేత వీర రాఘవ' చిత్రంలో పూజా హెగ్డే అలరించింది. ఈ క్రమంలో త్రివిక్రమ్ డైరెక్ట్ చేసిన 'అల వైకుంఠపురములో' చిత్రంలో కూడా ఛాన్స్ దక్కించుకుంది. ఇందులో ఈ బ్యూటీ కాళ్ళకు ఎంతటి ప్రాధాన్యత ఇచ్చారో.. ఏ రేంజ్ లో వర్ణించారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ సినిమా సక్సెస్ తో ఈ భామ స్టార్ హీరోయిన్ గా ఎదగడంతో పాటుగా రెమ్యూనరేషన్ కూడా బాగా పెరిగింది. ఇదిలా ఉంటే ఇప్పుడు త్రివిక్రమ్ తదుపరి సినిమాలో కూడా పూజా నే హీరోయిన్ గా ఫైనలైజ్ చేశారని ఫిలిం సర్కిల్స్ లో టాక్ వినిపిస్తోంది.

మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో '#SSMB28' అనే ప్రాజెక్ట్ ని ఇటీవలే అధికారికంగా ప్రకటించారు. వీరి కాంబోలో వస్తున్న ఈ హ్యాట్రిక్ మూవీని హారిక అండ్ హాసిని క్రియేషన్స్ ప‌తాకంపై రాధాకృష్ణ‌ (చిన‌బాబు) నిర్మించనున్నారు. కమర్షియల్ ఎంటర్టైనర్ గా రూపొందనున్న ఈ చిత్రం కోసం త్రివిక్రమ్ మళ్ళీ పూజా హెగ్డే కే ఓటు వేశారట. ఇదే కనుక నిజమైతే SSMB28 స్టార్ డైరెక్టర్ తో కలిసి అమ్మడు చేసే మూడో ప్రాజెక్ట్ అవుతుంది. సామ్ తర్వాత త్రివిక్రమ్ తో మూడుసార్లు వర్క్ చేసే అవకాశం అందుకున్న హీరోయిన్ పూజా నే అవుతుంది.

దర్శకుడికి తాను రాసుకున్న క‌థ‌లో హీరోయిన్ పాత్ర ఎవ‌రితో చేయిస్తే బెట‌ర్ గా ఉంటుందో.. అలానే కంఫ‌ర్ట్ గా ఉంటుందో నిర్ణ‌యం తీసుకునే హ‌క్కు ఉంటుంది. ఓ సినిమా హిట్ అవ్వాలంటే అందులో భాగ‌మైన వారి మ‌ధ్య కంఫ‌ర్ట్ జోన్ చాలా ముఖ్యమనే విషయం తెలిసిందే. త్రివిక్రమ్ కు పూజా యాక్టింగ్ పెరఫార్మన్స్ నచ్చడంతో పాటుగా ప్రస్తుతం ఈ బ్యూటీతోనే కంఫ‌ర్ట్ ఫీల్ అవుతున్నాడు కాబట్టే హీరోయిన్ గా రిపీట్ చేస్తున్నాడని అనుకోవచ్చు. మరి ఇది ఇక్కడితో ఆగుతుందా లేదా నెక్స్ట్ ప్రాజెక్ట్ కు కూడా కంటిన్యూ అవుతుందా అనేది చూడాలి.