Begin typing your search above and press return to search.

ప్రభాస్ లైనప్ లో ఈ క్రేజీ ప్రాజెక్ట్ ఎప్పుడు ఉంటుందో..?

By:  Tupaki Desk   |   2 April 2022 1:30 AM GMT
ప్రభాస్ లైనప్ లో ఈ క్రేజీ ప్రాజెక్ట్ ఎప్పుడు ఉంటుందో..?
X
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్నారు. ఇటీవల 'రాధేశ్యామ్' సినిమాతో నిరాశ పరిచిన డార్లింగ్.. 'ఆది పురుష్' 'సలార్' 'స్పిరిట్''ప్రాజెక్ట్ కె' వంటి పాన్ ఇండియా చిత్రాలను లైన్ లో పెట్టారు.

ఇదే క్రమంలో మారుతి దర్శకత్వంలో ప్రభాస్ ఓ సినిమా చేస్తారని గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. ఈ ప్రాజెక్ట్ ని అధికారికంగా ప్రకటించక ముందే ఇప్పుడు కొత్తగా కొరటాల శివతో డార్లింగ్ మరో సినిమా చేయనున్నారనే టాక్ బయటకు వచ్చింది.

ప్రభాస్ - అనుష్క హీరోహీరోయిన్లుగా తెరకెక్కిన 'మిర్చి' సినిమాతో దర్శకుడిగా మారాడు ర‌చ‌యిత కొర‌టాల శివ‌. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘనవిజయం సాధించింది. ఆ తర్వాత మహేష్ బాబు - ఎన్టీఆర్ వంటి అగ్ర హీరోలతో సినిమాలు చేసి సక్సెస్ అందుకున్నారు కొరటాల.

ప్రస్తుతం టాలీవుడ్ స్టార్స్ డైరెక్టర్స్ లో ఒకరిగా రాణిస్తున్న కొరటాల శివ.. 'మిర్చి' త‌ర‌వాత ప్ర‌భాస్ తో మ‌రో మూవీ చేయడానికి అప్పట్లోనే ఒప్పందం చేసుకున్నారని టాక్. ఎప్పటి నుంచో ట్రై చేస్తున్నా ఈ కాంబో మళ్లీ సెట్ కాలేదు.

అయితే ఇటీవల ప్ర‌భాస్ - కొర‌టాల భేటీ అయ్యారని.. ఈ సందర్భంగా ఓ స్టోరీ గురించి డిస్కషన్ జరిగిందని వార్తలు వస్తున్నాయి. కొరటాల చెప్పిన సింగిల్ లైన్ ఆర్డర్ నచ్చడంతో.. ప్ర‌భాస్ ఈ సినిమా చేయ‌డానికి చాలా ఉత్సాహంగా ఉన్నాడట.

టాలీవుడ్ లోని ఓ పెద్ద బ్యానర్ లో 'ప్రభాస్ - కొరటాల' ప్రాజెక్ట్ ప‌ట్టాలెక్కే అవ‌కాశం ఉందని అంటున్నారు. అయితే డార్లింగ్ ప్రస్తుతం ఫుల్ బిజీగా ఉన్నాడు. మరోవైపు కొరటాలకు కూడా ఇతర కమిట్మెంట్స్ ఉన్నాయి. దీంతో ఈ క్రేజీ కాంబో ఎప్పుడు సెట్స్ మీదకు వెళ్తుందనేది ఇప్పుడప్పుడే చెప్పలేం.

ఇప్పటికే 'ఆది పురుష్' షూటింగ్ పూర్తి చేసిన ప్రభాస్.. త్వరలో మారుతి చిత్రాన్ని సెట్స్ మీదకు తీసుకెళ్తారని ప్రచారం జరుగుతోంది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో చేస్తున్న 'సలార్' సినిమా ఆల్రెడీ సెట్స్ మీదనే ఉంది. నాగ్ అశ్విన్ తో చేస్తున్న పాన్ వరల్డ్ 'ప్రాజెక్ట్ K' కంప్లీట్ అవడానికి కాస్త ఎక్కువ సమయమే పట్టనుంది.

సందీప్ రెడ్డి వంగా 'యానిమాల్' సినిమా చేసిన వెంటనే ప్రభాస్ తో 'స్పిరిట్' స్టార్ట్ చేయాలని చూస్తున్నారు. ఒకవేళ మారుతి లానే వీలయినంత త్వ‌ర‌గా సినిమాని పూర్తి చేయాలని ప్లాన్ చేసుకుంటే.. వీటి మ‌ధ్య కొర‌టాల శివ సినిమా ఉండే ఛాన్స్ ఉంది.

కాకపోతే ఇప్పుడు 'ఆచార్య' చిత్రాన్ని రిలీజ్ కు రెడీ చేసిన కొరటాల.. ఎన్టీఆర్ తో తదుపరి సినిమా చేయనున్నట్లు అనౌన్స్ చేశారు. జూన్ లో ఈ ప్రాజెక్ట్ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమవుతుందని సమాచారం. ఇదొక రివేంజ్ డ్రామా అని తెలుస్తోంది.

ఎన్టీఆర్ తో చేయబోయే పాన్ ఇండియా మూవీ కంప్లీట్ అయితేనే కొరటాల శివ మరో సినిమా మీద దృష్టి పెట్టే అవకాశం లేదు. అప్పటికి ప్రభాస్ లైనప్ లో ఎలాంటి మార్పులు చోటుచేసుకుంటాయో చెప్పలేం. కొర‌టాల‌ ఎప్పుడు ఫ్రీ అవుతారో.. డార్లింగ్ ఎప్పుడు డేట్లు ఇస్తాడో.. మిర్చి కాంబోలో రెండో సినిమా ఎప్పుడు ఉంటుందో..!