Begin typing your search above and press return to search.

'రాధే శ్యామ్' మేకర్స్ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటి...?

By:  Tupaki Desk   |   13 Oct 2020 1:05 PM GMT
రాధే శ్యామ్ మేకర్స్ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటి...?
X
టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థలలో ఒకటైన యూవీ క్రియేష‌న్స్ సక్సెస్ ఫుల్ చిత్రాలను నిర్మిస్తూ దూసుకుపోతోంది. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ స్నేహితులైన ఉప్పలపాటి ప్రమోద్ - వంశీ కృష్ణలు కలిసి ఈ ప్రొడక్షన్ హౌస్ ని నిర్వహిస్తున్నారు. ఒకవైపు భారీ బడ్జెట్ సినిమాలు నిర్మిస్తూనే.. మరోవైపు మీడియం బడ్జెట్ సినిమాలు కూడా తీస్తూ బ్యాలన్సుడ్ గా వెళ్తున్నారు. ప్రస్తుతం డార్లింగ్ ప్రభాస్ తో 'రాధే శ్యామ్' అనే పాన్ ఇండియా మూవీ రూపొందిస్తున్నారు. 'జిల్' ఫేమ్ రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని టీ సిరీస్ వారితో కలిసి భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. తెలుగు హిందీ తమిళ్ మలయాళ భాషల్లో రానున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది రిలీజ్ చేయబోతున్న మేకర్స్ ప్రకటించారు. అయితే 'రాధే శ్యామ్' సినిమా తర్వాత ఈ ప్రొడక్షన్ హౌస్ నిర్మించే ప్రాజెక్ట్ విషయంలో క్లారిటీ రావడం లేదు.

కాగా, యూవీ క్రియేష‌న్స్ వారు గతంలో వీరి బ్యానర్ లో సినిమాలు తీసిన ముగ్గురు దర్శకులకు ఇప్పటికే అడ్వాన్సులు ఇచ్చారట. మేర్ల‌పాక గాంధీ(ఎక్సప్రెస్ రాజా).. సుజీత్(రన్ రాజా రన్ - సాహో).. మారుతి(భలే భలే మగాడివోయ్ - మహానుభావుడు)లను లైన్లో పెట్టినట్లు తెలుస్తోంది. ఇక హీరోలలో రామ్ చ‌ర‌ణ్ - నితిన్ - ర‌వితేజ‌ - అల్లు అర్జున్ - విజయ్ దేవ‌ర‌కొండ‌ ల‌కి కూడా అడ్వాన్సులు ఇచ్చారట. వేళల్లో ఎవరో ఒకరితో ఈ ప్రొడక్షన్ లో సినిమా ఉండే అవకాశం ఉంది. కాకపోతే ప్రస్తుతం ఈ హీరోలందరూ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. దీంతో యూవీ క్రియేష‌న్స్ టీమ్ త‌రువాత చేయ‌బోయే సినిమా ఏంటనే దానిపై ఇంకా స్పష్టత రావడంలేదు. 2019లో 'సాహో' సినిమాని రిలీజ్ చేసిన ఈ నిర్మాణ సంస్థ.. 2021లో 'రాధేశ్యామ్' ని రిలీజ్ చేయనున్నారు. మరి 'రాధేశ్యామ్' తదుపరి ప్రాజెక్ట్ ని త్వరలోనే ప్రకటిస్తారేమో చూడాలి.