Begin typing your search above and press return to search.

దీసావళికి ఊరికెళ్లిన ఆ నటి ఇంటిని దోచేశారు

By:  Tupaki Desk   |   1 Nov 2022 4:30 PM GMT
దీసావళికి ఊరికెళ్లిన ఆ నటి ఇంటిని దోచేశారు
X
ప్రముఖ నటి వినయ్ ప్రసాద్ అన్నంతనే గుర్తుకు రాకపోవచ్చు. కానీ.. ఆమెను చూస్తే.. ఆమె నటించిన బోలెడన్ని సినిమాలు ఇట్టే గుర్తుకు వచ్చేస్తాయి. తెలుగు.. తమిళం.. కన్నడలోని పలు ప్రముఖ చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించి..

మంచి గుర్తింపు ఉన్న నటీమణుల్లో ఆమె ఒకరు. తెలుగులో ఇంద్ర.. ఆడవాళ్ల మాటలకు అర్థాలే వేరులే.. ఆంజనేయులు తదితర చిత్రాల్లో నటించిన ఆమెకు ఈ దీపావళి పండుగ.. భారీ షాక్ ను ఇచ్చింది.

అటు వెండి తెరతో పాటు.. బుల్లితెరలోనూ పలు సీరియల్స్ లో బిజీగా ఉన్న ఆమె బెంగళూరులో ఉంటారు. తాజాగా దీపావళి సందర్భంగా ఊరుకు వెళ్లారు. బెంగళూరు నుంచి ఉడిపికి వెళ్లిన ఆమె.. పండుగ తర్వాత తీరుబడిగా ఇంటికి వచ్చారు. అప్పటికే ఇంట్లోకి ప్రవేశించిన దొంగలు.. ఆమె ఇంటిని దోచేశారు. ఇంట్లో ఉన్న లాకర్ ను ఓపెన్ చేసి డబ్బులు చోరీ చేశారు.

భర్తతో కలిసి ఊరెళ్లి వచ్చిన ఆమెకు ఇంటికి రాగానే చోరీ జరిగిన వైనాన్ని గుర్తించారు. వెంటనే వారు పోలీసుల్ని ఆశ్రయించారు. తమ ఇంట్లో చోరీ జరిగినట్లుగా పేర్కొన్న వారు.. లాకర్ లో ఉన్న నగదు ఎంత మిస్ అయ్యిందన్న విషయాన్ని మాత్రం బయటకు వెల్లడించకపోవటం గమనార్హం. నటి.. ఆమె భర్త ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా దొంగల్ని ట్రేస్ చేసేందుకు పోలీసులు తెగ ప్రయత్నిస్తున్నారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.