Begin typing your search above and press return to search.

ట్విట్టర్ తనను షాడో బ్యాన్ చేసిందని ఆరోపించిన స్టార్ హీరోయిన్..!

By:  Tupaki Desk   |   27 Feb 2021 11:50 AM GMT
ట్విట్టర్ తనను షాడో బ్యాన్ చేసిందని ఆరోపించిన స్టార్ హీరోయిన్..!
X
బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ ఈ మధ్య సినిమాలతో పాటు ఏదొక ఇష్యూ పై కామెంట్స్ చేస్తూ వార్తల్లో నిలుస్తూనే ఉంది. తనకు సంబంధించిన విషయాలు.. సంబంధంలేని విషయాల గురించి మాట్లాడుతూ సోషల్ మీడియాలో హీట్ పెంచుతోంది. ఈ నేపథ్యంలో ఈరోజు మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ ఫామ్ ట్విట్టర్ తన అకౌంట్ ని నిషేధించినట్లు కంగనా రనౌత్ ఆరోపించారు. ట్విట్టర్ యాజమాన్యం తనను భయపెడుతోందని.. అయితే తనను సస్పెండ్ చేయలేరని.. అందుకే షాడో బ్యాన్ విధించిందని కంగనా తెలిపింది.

"నా ఖాతా షాడో బ్యాన్ అయింది. ఎందుకంటే జాక్ చాచా మరియు ట్విట్టర్ బృందం నన్ను చూసి భయపడుతోంది. వారు నన్ను సస్పెండ్ చేయలేరు. నేను ఫాలోవర్స్ పెంచుకోడానికి.. నన్ను నేను ప్రమోట్ చేసుకోడానికి ఇక్కడ లేను. నేను దేశం కోసం ఇక్కడ ఉన్నాను. అది వారిని బాధిస్తోంది" అని కంగనా ట్వీట్ చేసింది. కాగా, గత వారం ట్విట్టర్‌ వేదికగా 'కూ' యాప్ లో చేరుతున్నట్లు కంగనా ప్రకటించిన సంగతి తెలిసిందే. ''ట్విట్టర్‌ ఇకపై నీ టైమ్‌ అయిపోంది. ఇది 'కూ' యాప్‌ కు మారాల్సిన సమయం. నా అకౌంట్‌ కు సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడిస్తాను. దేశీయంగా తయారు చేసిన 'కూ' యాప్‌ ను వాడేందుకు ఎంతో థ్రిల్లింగ్‌ గా ఉంది'' అంటూ కంగనా పేర్కొంది.