Begin typing your search above and press return to search.

ఉత్కంఠ పెంచుతున్న `మ‌నీహీస్ట్` సిరీస్

By:  Tupaki Desk   |   24 Aug 2021 4:48 AM GMT
ఉత్కంఠ పెంచుతున్న `మ‌నీహీస్ట్` సిరీస్
X
ప్ర‌స్తుతం ఓటీటీ సిరీస్ ల హ‌వా కొన‌సాగుతోంది. అగ్ర క‌థానాయ‌కులు సైతం డిజిట‌ల్ సిరీస్ ల‌తో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేందుకు భేష‌జానికి పోవ‌డం లేదు. నాగార్జున‌- వెంక‌టేష్‌- రానా - నాగ‌చైత‌న్య‌-త‌మ‌న్నా-కాజ‌ల్ ఇలా పెద్ద స్టార్లంతా ఓటీటీ వేదిక‌ల‌పై అల‌రించేందుకు ఆస‌క్తిని క‌న‌బ‌ర‌చ‌డం కొత్త మ‌లుపు.

ఇప్పుడు రానా - శ్రుతిహాస‌న్ - హ‌ర్థిక్ పాండ్య - అనీల్ కపూర్- రాధికా ఆప్టే - బెల్లా త‌దిత‌రులు న‌టించిన `మ‌నీ హీస్ట్` సిరీస్ సర్వ‌త్రా ఉత్కంఠ పెంచింది. ఈ సిరీస్ ను చూసిన వీక్షకులు ఉత్కంఠతో నిండిన ఎపిసోడ్ లను ఆస్వాధించేందుకు ఆస‌క్తిని క‌న‌బ‌రిచారు. ప్రతి ఎపిసోడ్ ట్విస్టుల‌తో రంజింప‌జేయ‌డంతో ప్ర‌జ‌లు వీక్ష‌ణ‌కు ఆస‌క్తిని క‌న‌బ‌రిచారు. సీజన్ 5 వాల్యూమ్ కోసం ఒక‌టే ఉత్కంఠ నెల‌కొంది. మ‌రో ప‌ది రోజుల్లో ఇది విడుదల కానుంది. ఇప్ప‌టికే ప్రోమోలు ప్రకటనలు అందరినీ ఆకర్షిస్తున్నాయి. తాజాగా నెట్ ఫ్లిక్స్ ఇండియా మనీ హీస్ట్ పై కొత్త పాట జ‌ల్దీ ఆవో.. ను విడుదల చేసింది. ఇది పాపులర్ సిరీస్ కి దేశీ టచ్ తో ఆక‌ట్టుకుంది. న్యూక్లియా స్వరపరిచిన మ్యూజిక్ వీడియో `జల్ది ఆవో` సిరీస్ ని పండ‌గ‌లా ప్ర‌ద‌ర్శించింది. మ్యూజిక్ వీడియో మనీ హీస్ట్ నుండి కొన్ని చిరస్మరణీయ సన్నివేశాలను ఆవిష్క‌రించింది.

ఇందులో ఒక్కో పాత్ర ఎంతో ఆస‌క్తిని క‌లిగిస్తున్నాయి. శృతిహాస‌న్ నైరోబిని నోటిలో పువ్వు పెట్టుకుని క‌నిపించ‌గా.. అనిల్ కపూర్ డెన్వర్ లాగా మనీ బెడ్ మీద డ్యాన్స్ చేయ‌డం ఆస‌క్తిక‌రం. ఫైనల్ సీజన్ లో ఆర్టురో చనిపోవాలని కోరుకునే ప్రతి అభిమాని తరపున రాధికా ఆప్టే - విక్రాంత్ మాస్సే పాత్ర‌ల సంవిధానం ఆక‌ట్టుకుంటోంది. మ‌నీహీస్ట్ ప్ర‌మోష‌న‌ల్ మెటీరియ‌ల్ వేగంగా అంత‌ర్జాలంలో వైర‌ల్ అవుతోంది.

మనీ హీస్ట్ సీజన్ 5 రెండు భాగాలుగా తెర‌కెక్కింది. వాల్యూమ్ 1 పేరుతో మొదటి భాగం సెప్టెంబర్ లో నెట్ ఫ్లిక్స్ లో రిలీజైంది. వాల్యూమ్ 2 ప్రీమియర్ తర్వాత ఈ సిరీస్ డిసెంబర్ లో ముగుస్తుంది.