Begin typing your search above and press return to search.

ముఖం పాడుచేసిన‌ డాక్ట‌ర్ పై హీరోయిన్ ఫిర్యాదు.. ఆమె డిమాండ్ ఇదే!

By:  Tupaki Desk   |   27 April 2021 3:31 PM GMT
ముఖం పాడుచేసిన‌ డాక్ట‌ర్ పై హీరోయిన్ ఫిర్యాదు.. ఆమె డిమాండ్ ఇదే!
X
తాను రెగ్యుల‌ర్ ఫేషియ‌ల్ కోసం ఓ క్లినిక్ కు వెళ్తే.. ఓ డాక్ట‌ర్ ప్ర‌యోగం చేసిందని, దీంతో.. త‌న ముఖం పాడైపోయింద‌ని కోలీవుడ్ బ్యూటీ రైజా విల్ స‌న్ తీవ్ర ఆవేద‌న వ్య‌క్తం చేసిన సంగ‌తి తెలిసిందే. త‌న‌ను క‌ళావిహీనంగా మార్చిన ఆ డాక్ట‌ర్ ను సంప్ర‌దించేందుకు వెళ్తే.. ఆమెను క‌ల‌వ‌నీయ‌లేద‌ని కూడా చెప్పింది రైజా. అయితే.. ఈ విష‌య‌మై త‌మిళ‌నాడు మెడిక‌ల్ కౌన్సిల్ తోపాటు నేష‌న‌ల్ మెడిక‌ల్ క‌మిష‌న్ కు ఫిర్యాదు చేసిన‌ట్టు స‌మాచారం.

న‌టి రైజా విల్స‌న్ ఫేషియ‌ల్ కోసం వెళ్తే.. అక్క‌డి డాక్ట‌ర్ భైర‌వి స్కిన్ ట్రీట్మెంట్ ఏదో చేసింద‌ని ఈ మ‌ధ్య తెలిపింది. తాను వ‌ద్ద‌ని చెప్పినా విన‌కుండా.. బాగుంటుంద‌ని ఒప్పించి మ‌రీ ప్ర‌యోగం చేసింద‌ట‌. కానీ.. అది విక‌టించ‌డంతో ఆ హీరోయిన్ ఫేస్ గుర్తు ప‌ట్ట‌లేనంత‌గా మారిపోయింది.

ముఖం మారిపోవ‌డంతోపాటు క‌న్ను కింద న‌ల్ల‌గా గ‌డ్డ‌లాగా వాచిపోయింది. దీంతో తీవ్ర ఆవేద‌న‌కు గురైన‌ న‌టి.. స‌ద‌రు డాక్ట‌ర్ క‌ల‌వ‌డానికి వెళ్తే అవ‌కాశం ఇవ్వ‌లేద‌ని తెలిపింది. ఆమె న‌గ‌రంలో లేద‌ని జ‌వాబు ఇచ్చార‌ని చెప్పింది. దీంతో.. ఆమె ఈ విష‌యాన్ని మెడిక‌ల్ కౌన్సిల్ దృష్టికి తీసుకెళ్లిన‌ట్టు తెలిపింది. ఈ మేర‌కు సోష‌ల్ మీడియాలో ఆ లేఖ‌ను కూడా ఉంచారు రైజా.

ఆ డాక్ట‌ర్ ప‌ని వ‌ల్ల త‌న ముఖం మొత్తం పాడైపోయింద‌ని, తాను మ‌రికొన్నాళ్ల‌పాటు సినిమాల్లో న‌టించే అవ‌కాశం లేకుండా పోయింద‌ని ఆవేద‌న వ్య‌క్తంచేసింది. అంతేకాకుండా.. మాన‌సికంగా కూడా తీవ్ర వేద‌న‌కు గురైన‌ట్టు తెలిపింది. త‌న‌కు జ‌రిగిన ఈ న‌ష్టానికి గానూ.. డాక్ట‌ర్ భైర‌వి నుంచి కోటి రూపాయ‌ల ప‌రిహారం ఇప్పించాల‌ని కోరిన‌ట్టు స‌మాచారం. అయితే.. స‌ద‌రు డాక్ట‌ర్ మాత్రం తాను బ‌ల‌వంతంగా ట్రీట్ మెంట్ చేయ‌లేద‌ని చెప్పిన‌ట్టు తెలుస్తోంది.

కోలీవుడ్ ఇండ‌స్ట్రీకి చెందిన న‌టి రైజా విల్ స‌న్.. 2017లో 'వెల‌య్య‌లా ప‌ట్ట‌ధారి-2' సినిమాతో తెరంగేట్రం చేసింది. ఆ తర్వాత బిగ్ బాస్ సీజన్లో పాల్గొంది. 2018లో 'ప్యార్ ప్రేమ కాదల్'తో సత్తాచాటింది. ప్రస్తుతం 'అలైస్', 'హ్యాష్ ట్యాగ్ లవ్' వంటి చిత్రాల్లో నటిస్తోంది.