Begin typing your search above and press return to search.

డ్రగ్స్‌ కేసు : విచారణకు హాజరైన ప్రముఖ లేడీ యాంకర్‌

By:  Tupaki Desk   |   27 Sep 2020 2:49 AM GMT
డ్రగ్స్‌ కేసు : విచారణకు హాజరైన ప్రముఖ లేడీ యాంకర్‌
X
ఒక వైపు బాలీవుడ్‌ లో సుశాంత్‌ కేసు విచారణలో బయట పడ్డ డ్రగ్స్‌ కేసు సంచలనం రేపుతుంటే మరో వైపు కన్నడ సినీ పరిశ్రమలో వెలుగులోకి వచ్చిన డ్రగ్స్‌ రాకెట్‌ ప్రముఖులను జైలు పాలు చేసింది. ఇప్పటికే కన్నడ హీరోయిన్స్‌ అయిన రాగిణి ద్వివేది మరియు సంజన గర్లానీలు డ్రగ్స్‌ కేసులో అరెస్ట్‌ అయ్యారు. ఇటీవలే మంగుళూరు పోలీసులు నటుడు కిషోర్‌ శెట్టి మరియు అతడి ఇద్దరు మిత్రులను పోలీసులు ఈ కేసులో అరెస్ట్‌ చేశారు. ముఖ్యంగా కిషోర్‌ స్నేహితుడు అయిన తరుణ్‌ రాజ్‌ కు డ్రగ్స్‌ కేసుతో సరఫరాతో సంబంధం ఉన్నట్లుగా పోలీసుల ప్రాధమిక విచారణలో వెళ్లడయ్యిందట. కిషోర్‌ శెట్టి అండ్‌ టీంకు క్లోజ్‌ ఫ్రెండ్‌ అయిన యాంకర్‌ అనూష శ్రీకి కూడా పోలీసులు నోటీసులు జారీ చేశారు. కిషోర్‌ శెట్టి రెగ్యులర్‌ గా పార్టీలు ఇచ్చేవాడు. ఆ పార్టీల్లో అనూష శ్రీ పాల్గొనేది అంటూ పోలీసుల విచారణలో వెళ్లడి అయ్యింది.

కిషోర్‌ శెట్టి ప్రతి పార్టీలో కూడా డ్రగ్స్‌ వినియోగం జరిగినట్లుగా పోలీసులకు నిర్థారణ అయ్యిందని కన్నడ మీడియాలో కథనాలు వస్తున్నాయి. దాంతో ఆ పార్టీలో పాల్గొన్న ప్రతి ఒక్కరిని కూడా విచారించి డ్రగ్స్‌ వినియోగించినట్లుగా నిరూపితం అయితే పోలీసులు అరెస్ట్‌ కూడా చేసే అవకాశాలు ఉన్నాయట. పోలీసుల నోటీసులు అందుకున్న అనూష శ్రీ విచారణకు హాజరు అయ్యింది. ఆమెను పోలీసులు దాదాపుగా మూడున్నర గంటలు ప్రశ్నించారు. తరుణ్‌ రాజ్‌ కు తనకు 12 సంవత్సరాల క్రితం పరిచయం అయ్యిందని.. తరుణ్‌ నాకు ఆరు నెలలు డాన్స్ కొరియోగ్రఫీ చేశారు. తరుణ్‌ గురించి ఇంత వరకు మాత్రమే నాకు తెలుసు. అతడికి డ్రగ్స్‌ తో ఉన్న సంబంధం గురించి తెలియదు. నేనెప్పుడు డ్రగ్స్‌ తీసుకోలేదు అంటూ విచారణలో యాంకర్‌ అనూష శ్రీ వెళ్లడించింది.