Begin typing your search above and press return to search.

నైజాంలో నో సౌండ్‌..ఆంధ్రాలో ప్రీమియ‌ర్స్‌!

By:  Tupaki Desk   |   21 July 2022 12:30 PM GMT
నైజాంలో నో సౌండ్‌..ఆంధ్రాలో ప్రీమియ‌ర్స్‌!
X
నాగ‌చైత‌న్య న‌టించిన లేటెస్ట్ మూవీ `థాంక్యూ` మ‌రి కొన్ని గంట‌ల్లో థియేట‌ర్ల‌లో సందడి చేయ‌బోతోంది. విక్ర‌మ్ కె. కుమార్ డైరెక్ట్ చేశారు. రాశీఖ‌న్నా, మాళవిక నాయ‌ర్‌, అవికా గోర్ హీరోయిన్ లుగా న‌టించారు. స్టార్ ప్రొడ్యూస‌ర్ దిల్ రాజు నిర్మించిన ఈ మూవీ పై చైతూ తో పాటు ముగ్గురు హీరోయిన్ లు రాశీఖ‌న్నా, మాళవిక నాయ‌ర్‌, అవికా గోర్ భారీ అంచ‌నాలే పెట్టుకున్నారు.

ద‌ర్శ‌కుడు విక్ర‌మ్ కు కూడా ఈ మూవీ కీల‌కంగా మారింది. నేచుర‌ల్ స్టార్ నానితో చేసిన `గ్యాంగ్ లీడ‌ర్` ఆశించిన ఫ‌లితాన్ని అందించ‌క‌పోవ‌డంతో విక్ర‌మ్ కుమార్ `థాంక్యూ`పై భారీ ఆశ‌లు పెట్టుకున్నార‌ట‌.

వివిధ ద‌శ‌ల్లో సాగే ఓ యువ‌కుడి క‌థ‌గా ఈ మూవీని తెర‌కెక్కించారు. ఈ పాత్ర కోసం బ‌రువు త‌గ్గిన చైతూ స‌ర్ ప్రైజ్ లుక్స్ తో ఫ్యాన్స్ ని ఆక‌ట్టుకోబోతున్నాడు. ఇటీవ‌ల విడుద‌ల చేసిన టీజ‌ర్‌, ట్రైల‌ర్ సినిమాపై బ‌జ్ ని క్రియేట్ చేయ‌లేక‌పోయింది. ఇదిలా వుంటే మ‌రి కొన్ని గంట‌ల్లో రిలీజ్ కి రెడీ అవుతున్న ఈ మూవీ ప్రీమియ‌ర్స్ ని ప్ర‌త్యేకంగా మేక‌ర్స్ ఏర్పాటు చేశారు.

అయితే అది నైజాంలో కాదు.. ఏపీలో. జూలై 21 రాత్రి 9:30 గంట‌ల‌కు ఆంధ్ర ప్ర‌దేశ్ లోని నెల్లూర్‌, భీమ‌వ‌రం, విజ‌య‌వాడ‌, వైజాగ్‌, రాజ‌మండ్రి సిటీల‌లో ప్ర‌త్యేక ప్రీమియ‌ర్ షోల‌ని ఏర్పాటు చేశారు. తాజాగా ఇందులో క‌ర్నూలు కూడా వ‌చ్చి చేరింది. గురువారం వైజాగ్ లో మ్యూజిక‌ల్ కాన్స‌ర్ట్ ని నిర్వ‌హించిన మేక‌ర్స్ ఏపీలో మాత్ర‌మే ప్రీమియ‌ర్ షోల‌ని ఏర్పాటు చేయ‌డం ప‌లువురిని ఆశ్చ‌ర్యానికి గురిచేస్తోంది.

దిల్ రాజు ప్రాబ‌ల్యం వున్న నైజాం లో ప్రీమియ‌ర్స్ ని ప్లాన్ చేయ‌క‌పోవ‌డం ఏంట‌ని ప‌లువురు కామెంట్ లు చేస్తున్నారు. నైజాంలోనూ ప్లాన్ చేసి వుంటే ఇప్ప‌టికే పోస్ట‌ర్స్ రిలీజ్ చేసేవారు.

కానీ అది జ‌ర‌గ‌లేదు. కేవ‌లం ఏపీలోని సిటీల్లో ఏర్పాటు చేస్తున్న ప్రీమియ‌ర్ ఫోల‌కు సంబంధించిన అప్ డేట్ ఇచ్చారు. దిల్ రాజు ఫ‌స్ట్ టైమ్ ఇలా ఎందుకు చేస్తున్నారు? .. హైద‌రాబాద్ లో ప్రీమియ‌ర్స్ ఎందుకు ప్లాన్ చేయ‌ట్లేద‌ని కొంత మంది ఫ్యాన్స్ అనుమానం వ్య‌క్తం చేస్తున్నారు.