Begin typing your search above and press return to search.

PK ఫ్యాన్స్ కి మ‌ళ్లీ బిస్కెట్స్ వేస్తున్నాడా?

By:  Tupaki Desk   |   24 Oct 2021 7:32 AM GMT
PK ఫ్యాన్స్ కి మ‌ళ్లీ బిస్కెట్స్ వేస్తున్నాడా?
X
ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ ఫ్యాన్స్ ని సంతుష్ఠుల‌ను చేయ‌గ‌లిగితే ఎవ‌రికైనా దాని ఫ‌లితం కూడా అంతే ఇదిగా క‌లిసొస్తుంది. పీకే ఫ్యాన్స్ లో అంత‌టి వైబ్రేషన్ ఉంటుంది మ‌రి. త‌మ ఫేవ‌రెట్ తో పాటు స‌ద‌రు వ్య‌క్తుల‌కు కావాల్సినంత ప్ర‌మోష‌న్ ఉంటుంది. అది అవ‌కాశాల్ని కూడా తెచ్చి పెడుతుంది. కార‌ణం ఏదైనా కానీ.. ఇటీవ‌లి కాలంలో సంగీత ద‌ర్శ‌కుడు ఎస్.ఎస్.థ‌మ‌న్ పీకే వీరాభిమానిగా మారిపోయి అత‌డి కోసం ప‌రిత‌పించ‌డం తెలిసిందే. ఇది పీకే అభిమానుల‌కు బాగా క‌నెక్ట‌య్యింది.

వ‌కీల్ సాబ్ లాంటి బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రానికి సంగీతం అందించిన థ‌మ‌న్ కి అది కెరీర్ ప‌రంగా పెద్ద ప్ల‌స్ అవుతోంది. థ‌మ‌న్ తాజా ట్వీట్ ఇప్పుడు అంతే వైర‌ల్ గా మారుతోంది. ``నేను విమానంలో వకీల్ సాబ్ సినిమా చూస్తున్నాను`` అని థ‌మ‌న్ తెలిపాడు. ఆ సినిమాలోని పదపద యువత అనే లిరిక్ ని పాడింది థ‌మ‌న్. అలాగే వకీల్ సాబ్ బీజీఎంను నవంబర్ 16న విడుద‌ల చేస్తాన‌ని కూడా థ‌మ‌న్ వెల్ల‌డించారు. నిరంత‌రం పీకే ఫ్యాన్స్ కి ట‌చ్ లో ఉండ‌డానికి థ‌మ‌న్ త‌పిస్తున్నాడ‌నే దీనిని బ‌ట్టి అర్థ‌మ‌వుతోంది. సోష‌ల్ మీడియాల్లో అది అత‌డికి బోలెడంత ప్ర‌మోష‌న్ ని కూడా తెస్తోంది.

ప‌వ‌న్ క‌ల్యాణ్ త‌దుప‌రి `భీమ్లా నాయ‌క్` చిత్రంతో తెలుగు ప్రేక్ష‌కుల‌ను అల‌రించ‌నున్నారు. ఈ చిత్రానికి సాగర్ కె.చంద్ర దర్శకత్వం వ‌హించారు. క్రిష్ తో `హరి హర వీరమల్లు` సంక్రాంతి త‌ర్వాత స‌మ్మ‌ర్ లో విడుద‌ల‌య్యే ఛాన్సుంది. హరీశ్ శంకర్- సురేందర్ రెడ్డి చిత్రాల్లో నటించాల్సి ఉంది. ఇప్ప‌టికే ఆ ఇద్ద‌రూ క‌థ‌లు రెడీ చేసారు. హ‌రీష్ అయితే కాస్టింగ్ ఎంపిక‌ల్లో బిజీగా ఉన్నాడు.