Begin typing your search above and press return to search.

ఎన్టీఆర్‌ షో లో మహేష్‌ ప్రశ్నకు కంగారు పడ్డ దేవి, థమన్‌

By:  Tupaki Desk   |   5 Nov 2021 3:18 PM GMT
ఎన్టీఆర్‌ షో లో మహేష్‌ ప్రశ్నకు కంగారు పడ్డ దేవి, థమన్‌
X
యంగ్ టైగర్ ఎన్టీఆర్‌ బుల్లి తెర షో ఎవరు మీలో కోటీశ్వరులు దీపావళి స్పెషల్‌ గా దేవి శ్రీ ప్రసాద్‌ మరియు థమన్ లు హాజరు అయిన ఎపిసోడ్ ను టెలికాస్ట్‌ చేయడం జరిగింది. జెమిని టీవీలో ప్రసాద్ అయిన ఈ ఎపిసోడ్ కు కూడా గత సెలబ్రెటీల ఎపిసోడ్‌ మాదిరిగానే మంచి రేటింగ్ నమోదు కాబోతుందని షో నిర్వాహకులు అంటున్నారు. ఇద్దరు స్టార్ మ్యూజిక్ డైరెక్టర్స్‌ షో కు హాజరు అవ్వడం వల్ల ప్రేక్షకులు మరియు ఇండస్ట్రీ వర్గాల వారు అంతా కూడా ఆ ఎపిసోడ్‌ పై ఫోకస్ పెట్టారు. చాలా మంది చాలా రకాలుగా ఆ ఎపిసోడ్‌ పై అంచనాలు పెంచుకున్నారు. అనుకున్నట్లుగానే మంచి ఎంటర్‌ టైన్ మెంట్‌ ను అందించేలా ఆ ఎపిసోడ్‌ సాగింది. సాదారణ కంటెస్టెంట్స్ వచ్చిన సమయంలో కంటే సెలబ్రెటీ కంటెస్టెంట్స్ తో ఆట సాగినప్పుడు అందరి దృష్టి జెమిని టీవీ పైనే ఉంటుందని మరోసారి నిరూపితం అయ్యింది. ఇద్దరు స్టార్‌ మ్యూజిక్ డైరెక్టర్స్ పలు విషయాలను ముచ్చటించుకుంటూ ఆటలో ముందుకు సాగారు.

ఆటలో ముందుకు సాగుతున్న సమయంలో ఎన్టీఆర్‌ వీరికి మహేష్‌ బాబుకు సంబంధించిన ఒక ప్రశ్నను వేయడం జరిగింది. ఈ క్రిద ఇచ్చిన హీరోల్లో ఏ హీరో తమిళనాడులో పుట్టారు అంటూ రజినీకాంత్‌.. అజిత్‌.. అనీల్ కుమార్ మరియు మహేష్ బాబుల పేర్లను ఇవ్వడం జరిగింది. నలుగురి పేర్లలో ఎవరు చెన్నైలో పుట్టారు అనే విషయం తేల్చుకోవడానికి ఇద్దరు మ్యూజిక్ డైరెక్టర్స్ కు చాలా సమయం పట్టింది. ఈ ప్రశ్న వద్ద ఇద్దరు కూడా చాలా కంగారు పడ్డారు. అజిత్ అనుకున్నారు కాని కాదు అని ఆ తర్వాత ఆప్షన్‌ ను మార్చుకున్నారు. చివరకు మహేష్ బాబు ఆప్షన్ ను ఎంపిక చేసుకున్నారు. ఆ సమయంలో కూడా ఎన్టీఆర్‌ వారిద్దరిని తెగ కంగారు పెట్టాడు. చివరి వరకు ఇద్దరు కూడా ఈ ప్రశ్నకు సమాధానం చెప్పలేక పరువు పోతుందా అనే ఫీలింగ్‌ లో ఉండి పోయారు.

చాలా సస్పెన్స్‌ తర్వాత మహేష్‌ బాబు ఆన్సర్‌ కరెక్ట్‌ అంటూ ఎన్టీఆర్‌ చెప్పడంతో ఇద్దరు కూడా హమ్మయ్య పరువు నిలిచింది అంటూ ఊపిరి పీల్చుకున్నారు. ఇద్దరికి ఇద్దరు కూడా ఈ ప్రశ్నకు సమాధానం చెప్పలేక ఏదో ఒక గెస్‌ వేయడం అందరిని విడ్డూరంగా అనిపించింది. మహేష్‌ బాబు ఆన్సర్‌ అనే విషయం ఇద్దరిలో ఏ ఒక్కరు కూడా ఊహించుకోలేదు. కాని మహేష్‌ బాబు ఆన్సర్‌ విషయంలో ఎన్టీఆర్‌ నుండి కూడా కాస్త క్లూ  వాళ్లకు వెళ్లినట్లుగా అనిపించింది అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి ఇద్దరు మ్యూజిక్ డైరెక్టర్స్ తో తెగ వాయించి ఆట ఆడేసుకున్నాడు ఎన్టీఆర్‌. ఈ షో ముగింపు దశకు వచ్చేస్తోంది. చివరి ఎపిసోడ్‌ ను మహేష్‌ బాబుతో ప్లాన్‌ చేసిన విషయం తెల్సిందే.