Begin typing your search above and press return to search.

ఇద్దరు 'బిల్లా'లు కలిశారు

By:  Tupaki Desk   |   20 Feb 2019 2:05 PM GMT
ఇద్దరు బిల్లాలు కలిశారు
X
రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ హీరోగా సుజీత్‌ దర్శకత్వంలో రూపొందుతున్న 'సాహో' మూవీ రామోజీ ఫిల్మ్‌ సిటీలో చిత్రీకరణ జరుపుకుంటుంది. భారీ యాక్షన్‌ ఎంటర్‌ టైనర్‌ గా రూపొందుతున్న 'సాహో' చిత్రం షూటింగ్‌ లో యూనిట్‌ సభ్యులు అంతా కూడా చాలా బిజీగా ఉన్న సమయంలో అనుకోని అతిథి అక్కడ ప్రత్యక్షం అయ్యి అందరిని ఆశ్చర్యపర్చాడట.

'సాహో' చిత్ర సెట్స్‌ కు వచ్చిన ఆ అనుకోని అథితి మరెవ్వరో కాదు తమిళ స్టార్‌ హీరో అజిత్‌. ప్రస్తుతం బాలీవుడ్‌ హిట్‌ మూవీ 'పింక్‌' తమిళ రీమేక్‌ లో నటిస్తున్న అజిత్‌ ఆ చిత్రం షూటింగ్‌ నిమిత్తం రామోజీ ఫిల్మ్‌ సిటీలో ఉన్నాడు. షూటింగ్‌ గ్యాప్‌ సందర్బంగా అజిత్‌ పక్కనే 'బాహుబలి' ఫేం ప్రభాస్‌ మూవీ 'సాహో' చిత్రీకరణ జరుగుతుందని తెలుసుకుని అక్కడకు వెళ్లాడట.

'సాహో' యూనిట్‌ సభ్యులు అజిత్‌ రాకతో ఒక్కసారిగా ఆశ్చర్యపోయారట. ప్రభాస్‌ మరియు ఇతర యూనిట్‌ సభ్యులు అజిత్‌ తో సెల్ఫీ లు, ఫొటోలు తీసుకోవడంతో పాటు సాహో గురించిన విషయాలు, విశేషాలను తెలియజేశారట. తమిళంలో అజిత్‌ చేసిన బిల్లా చిత్రాన్ని తెలుగులో ప్రభాస్‌ రీమేక్‌ చేసిన విషయం తెల్సిందే. అలా ప్రభాస్‌, అజిత్‌ లకు చాలా కాలం క్రితమే సన్నిహిత్యం ఏర్పడింది. అందుకే పక్కనే ప్రభాస్‌ ఉన్నాడనే విషయం తెలిసి అజిత్‌ కలిసేందుకు వెళ్లినట్లుగా తెలుస్తోంది.

ఈ కలయికకు సంబంధించి ఇంకా ఎలాంటి ఫొటోలు సోషల్‌ మీడియాలో రాలేదు. త్వరలోనే ఈ కలయిక ఫొటోలు సోషల్‌ మీడియాలో వచ్చే అవకాశం ఉంది.