Begin typing your search above and press return to search.

పూరీ మూవీలో విలన్ గా మిస్టర్ వరల్డ్

By:  Tupaki Desk   |   7 Jun 2016 10:54 AM IST
పూరీ మూవీలో విలన్ గా మిస్టర్ వరల్డ్
X
పూరీ జగన్నాథ్ కి కొత్త కొత్త హీరోయిన్లను పట్టుకొస్తాడని మాంచి పేరుంది. అలాగే విలన్స్ ని కూడా బాగానే ఇంట్రడ్యూస్ చేస్తుంటాడు పూరీ. ముఖ్యంగా యంగ్ హీరోలతో సినిమాలు చేసేటప్పుడు స్ట్రాంగ్ విలన్ ని చూపించేందుకు.. ఇలా కొత్త ఎటెంప్ట్స్ చేస్తుంటాడు. ఇప్పుడు టీవీ యాక్టర్ గా గుర్తింపు ఉన్న ఠాకూర్ అనూప్ సింగ్ ను తన ప్రాజెక్ట్ లోకి తీసుకున్నాడు పూరీ.

మిస్టర్ వరల్ట్ అయిన ఠాకూర్ ను ప్రస్తుతం తను తీస్తున్న రోగ్ మూవీలో మెయిన్ విలన్ గా చేసేందుకు ఒప్పించాడు పూరీ జగన్నాథ్. వాస్తవానికి ఈ రోల్ ని ముందు సోనూసూద్ తో చేయించాలన్నది పూరీ ఐడియా. కానీ ప్రస్తుతం జాకీచాన్ మూవీ కుంగ్ ఫూ యోగ చిత్రంతో సోనూసూద్ బిజిగా ఉండడంతో.. కొత్త విలన్ ని వెతుక్కోవాల్సి వచ్చింది. అసలు పూరీ మూవీలో నటించడం ఓ ఆశ్చర్యకరమైన స్టోరీ అంటున్నాడు ఠాకూర్ అనూప్.

'2014లో ఓసారి టాలీవుడ్ లో అవకాశం కోసం హైద్రాబాద్ వచ్చాను. పూరీ సార్ టెంపర్ షూటింగ్ చూసేందుకు వెళ్లాను. మొదటి సారి ఆయన్ని చూసినపుడు స్టన్ అయిపోయాను. ఇప్పుడు ఆయన సినిమాలో చేసే ఛాన్స్ రావడం చూస్తే.. ఇదే డెస్టినీ అనిపిస్తోంది' అంటున్నాడు ఠాకూర్. మహాభారత్ టీవీ సిరీస్ లో ధృతరాష్ట్రుడిగా నటించిన ఠాకూర్.. మిస్టర్ వరల్డ్ టైటిల్ గెలుచుకున్నాక బాగా ఫేమస్ అయ్యాడు.