Begin typing your search above and press return to search.

ముంబైలో తెలుగు స్టార్ కార్ ఆపి మ‌రీ సెల్ఫీలు!

By:  Tupaki Desk   |   3 Nov 2021 5:31 AM GMT
ముంబైలో తెలుగు స్టార్ కార్ ఆపి మ‌రీ సెల్ఫీలు!
X
మెగాప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ క‌థానాయ‌కుడిగా శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో ఆర్.సి 15 తెర‌కెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా తొలి షెడ్యూల్ ముంబైలో ప్రారంభ‌మైంది. నాటి నుంచి ఏక‌ధాటిగా న‌టీన‌టుల‌పై శంక‌ర్ కీల‌క స‌న్నివేశాల్ని చిత్రీక‌రిస్తున్నారు. రామ్ చ‌ర‌ణ్‌.. కియారా అద్వాణీ స‌హా కీల‌క న‌టులంతా చిత్రీక‌ర‌ణ‌లో పాల్గొంటున్నారు. తాజాగా రామ్ చ‌ర‌ణ్ ముంబై షెడ్యూల్ ని పూర్తి చేసిన‌ట్లు తెలుస్తోంది. చిత్రీక‌ర‌ణ ముంగించుకుని నిన్న‌టి సాయంత్రం హైద‌రాబాద్ బ‌య‌లు దేరిన‌ట్లు తెలుస్తోంది. ముంబై ఎయిర్ పోర్టు స‌మీపంలో చ‌ర‌ణ్ కారులో ఎయిర్ పోర్ట్ కి చేరుకున్న ఫోటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మార‌డంతోనే విష‌యం బ‌య‌ట‌కు వ‌చ్చింది.

ఆ సంద‌ర్భంగా కొందరు అభిమానులు చ‌ర‌ణ్ కారులో ఉండ‌గానే సెల్పీలు దిగ‌డానికి ఆస‌క్తిని చూపించారు. చ‌ర‌ణ్ కూడా విసుక్కోకుండా అడిగిన వాళ్ల‌కు కారు ఆపి సెల్పీలు ఇచ్చిన‌ట్లు తెలుస్తోంది. అయితే ఇక్క‌డ‌ చ‌ర‌ణ్ లుక్ స్మార్ట్ గా మారిపోవ‌డం ఆస‌క్తిని పెంచుతోంది. నేరుగా షూటింగ్ స్పాట్ నుంచి మేక‌ప్ తొల‌గించుకుని ప్లైట్ కోసం హ‌డావుడిగా బ‌య‌లు దేరిన‌ట్లు తెలుస్తోంది. ఈ నేప‌థ్యంలోనే చ‌ర‌ణ్ లుక్ సినిమాలో ఇలాగే ఉండ‌బోతోంద‌ని ఈ హింట్ చెప్ప‌క‌నే చెబుతోంది. కళ్ల‌కు న‌ల్ల అద్దాలు..డెనిమ్ జీన్స్ ష‌ర్ట్ లో చెర్రీ ఎంతో ఆక‌ర్ష‌ణీయంగా క‌నిపించారు. `ఆర్.ఆర్.ఆర్` లో సీతారామ‌రాజు పాత్ర కోసం త‌న శ‌రీరంలో ఎన్నో మార్పులు తీసుకొచ్చారు చ‌ర‌ణ్‌. అలాగే ఆహార్యం కోసం చాలా క‌స‌ర‌త్తులే చేసారు.

ఇప్పుడు ఆ పాత్ర నుంచి పూర్తిగా బ‌య‌ట‌కు వ‌చ్చి ఫ్రెష్ లుక్ లో మెగా అభిమానుల‌కు ట్రీట్ ఇస్తున్నారు. శంక‌ర్ సినిమాలో చ‌ర‌ణ్ రెండు ర‌కాల విభిన్న పాత్ర‌లు పోషించనున్నారు. తొలుత ప్ర‌భుత్వ ఐఏఎస్ అధికారి పాత్ర‌లో..అటుపై ఓ పెద్ద రాజ‌కీయ నాయకుడి పాత్ర లో క‌నిపించనున్నారు. ఒక పాత్ర నుంచి మ‌రోక పాత్ర‌లోకి ట్రాన్స్ ఫార్మ్ కావ‌డం ఇదే తొలిసారి. ఆ ర‌కంగా చ‌ర‌ణ్ కి ఈ చిత్రం డిఫ‌రెంట్ ఎక్స్ పీరియ‌న్స్ అని చెప్పొచ్చు. చ‌ర‌ణ్ కి ఈ రెండు పాత్ర‌లు కూడా ఛాలెంజింగ్ అనే టాక్ వినిపిస్తోంది. శంక‌ర్ మార్క్ సోషియో పొలిటిక‌ల్ చిత్రంగా తెర‌కెక్కుతున్న‌ట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి థ‌మ‌న్ సంగీతం అందిస్తున్నారు. దిల్ రాజు అత్యంత భారీ బడ్జెట్ తో ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మిస్తున్నారు.