Begin typing your search above and press return to search.

8 ఏళ్ల క్రితం మోహన్‌బాబు వద్దకు తెలుగు 'కేబీసీ'

By:  Tupaki Desk   |   24 July 2021 4:29 AM GMT
8 ఏళ్ల క్రితం మోహన్‌బాబు వద్దకు తెలుగు కేబీసీ
X
హిందీలో సుదీర్ఘ కాలంగా కొనసాగుతున్న కౌన్‌ బనేగా కరోడ్‌ పతి ని తెలుగు లో నాగార్జున హోస్ట్‌ గా స్టార్ మా టీవీలో కొన్నాళ్ల క్రితం టెలికాస్ట్‌ చేయడం జరిగింది. నాగార్జున తర్వాత చిరంజీవి హోస్ట్ గా మలో ఎవరు కోటీశ్వరులు షో సాగింది. స్టార్‌ మా ఆ షోను కొన్ని కారణాల వల్ల నిలిపి వేసింది. ఇప్పుడు జెమిని టీవీ వారు మళ్లీ ఎవరు మీలో కోటీశ్వరులు అంటూ షో ను తీసుకు వచ్చేందుకు సిద్దం అయ్యింది.

ఎన్టీఆర్‌ హోస్టింగ్‌ చేయబోతున్న ఎవరు మీలో కోటీశ్వరులు షో కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సమయంలో మంచు విష్ణు ఆసక్తికర విషయాన్ని ఇటీవల ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.

స్టార్‌ మా లో మీలో ఎవరు కోటీశ్వరులు షో టెలికాస్ట్‌ కాకముందు జెమిని టీవీ వారు కేబీసీ హక్కులను దక్కించుకుని తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు ప్రయత్నాలు చేశారు. ఎనిమిది సంవత్సరాల క్రితం జెమిని వారు నాన్న గారు మోహన్‌ బాబు ను కౌన్ బనేగా కరోడ్‌ పతి తెలుగు వర్షన్ కోసం సంప్రదించారు. ఆ సమయంలో నాన్న ఆసక్తి చూపించలేదు.

నాన్న నో చెప్పడంతో జెమిని వారు ఆ ప్రాజెక్ట్‌ ను వదిలేశారు అంటూ తాజా ఇంటర్వ్యూలో మంచు విష్ణు చెప్పుకొచ్చాడు. ఆ సమయంలో మోహన్‌ బాబు కేబీసీ కి ఒప్పుకుని ఉంటే ఎలా ఉండేది అంటూ ఇప్పుడు చర్చ జరుగుతోంది.

దేశ వ్యాప్తంగా మంచి ఆధరణ ఉన్న కౌన్‌ బనేగా కరోడ్‌ పతిని తెలుగు లో సరిగ్గా చేస్తే తప్పకుండా సక్సెస్‌ అవుతుందనే నమ్మకం అంతా వ్యక్తం చేస్తున్నారు. స్టార్‌ మా వారు చేసిన చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల రేటింగ్‌ రాలేదని.. ఇప్పుడు జెమిని వారు ఎన్టీఆర్‌ తో చేయబోతున్న ఎవరు మీలో కోటీశ్వరులు షో కు ఖచ్చితంగా రేటింగ్‌ భారీ గా వస్తుందనే నమ్మకంను బుల్లి తెర వర్గాల వారు వ్యక్తం చేస్తున్నారు.

నాగార్జున మరియు చిరంజీవి వంటి బడా స్టార్స్‌ చేసిన షో అవ్వడం వల్ల సహజంగానే ఎన్టీఆర్ పై కాస్త ఒత్తిడి ఉంటుంది. కాని ఇంతకు ముందు ఎన్టీఆర్ బిగ్‌ బాస్ చేయడం వల్ల ఇప్పుడు ఎలాంటి ఇబ్బంది లేకుండానే ఎవరు మీలో కోటీశ్వరులు షో ను చేస్తాడనే నమ్మకంను అభిమానులు వ్యక్తం చేస్తున్నారు.

షో ను హోస్ట్‌ నడిపించే తీరును బట్టి ప్రేక్షకుల ఆసక్తి ఉంటుంది. అందుకే ప్రతి ఒక్కరు కూడా ఎన్టీఆర్‌ హోస్టింగ్‌ గురించి చర్చిస్తున్న సమయంలో మంచు విష్ణు చేసిన వ్యాక్యలు చర్చనీయాంశంగా మారాయి. ముక్కోపి అయిన మోహన్ బాబు ఒక వేళ కౌన్‌ బనేగా కరోడ్‌ పతి తెలుగు వర్షన్‌ ను ఎనిమిది సంవత్సరాల క్రితం చేసి ఉంటే ఫలితం ఎలా ఉండేది అంటూ కొందరు చర్చించుకుంటున్నారు.

మోహన్‌ బాబు కు బుల్లి తెరపై ఆ సమయంకు అనుభవం లేదు. కనుక ఆయన షో చేస్తే నిరాశ పర్చేవారేమో అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ షో కు చాలా ఓపిక ఎదుటి వారి నుండి ఆసక్తికర విషయాలను రాబట్టే నేర్పరితనం ఉండాలి. అది ఎన్టీఆర్‌ లో ఎక్కువే ఉంటుంది. కనుక ఎవరు మీలో కోటీశ్వరులు షో కు ఎన్టీఆర్‌ ఖచ్చితంగా పర్‌ఫెక్ట్‌ అంటూ కామెంట్స్‌ వినిపిస్తున్నాయి. జెమిని టీవీ వారు అప్పుడు వదిలేసినా ఇప్పుడు కంటిన్యూగా చేస్తారేమో చూడాలి.