Begin typing your search above and press return to search.

జీరో సైజ్ మాయలో తెలుగు హీరోయిన్లు?

By:  Tupaki Desk   |   7 Aug 2019 6:08 AM GMT
జీరో సైజ్ మాయలో తెలుగు హీరోయిన్లు?
X
గ్లామర్ ఫీల్డ్ లో జీరో సైజ్ బ్యూటీలు మనకు కొత్తేమీ కాదు. అయితే ఈ ట్రెండ్ కొంతకాలం కిందటివరకూ దాదాపు బాలీవుడ్ వరకే పరిమితమై ఉండేది. ఈ జీరో సైజ్ ట్రెండ్ ను బాలీవుడ్ లో మొదలు పెట్టిన భామ కరీనా కపూర్. ఇక మిగతా హీరోయిన్లు కూడా పోలోమని ఫాలో అయిపోయారు. హీరోలకు సిక్స్ ప్యాక్ ట్రెండ్ ఎలా జలగ లాగా వదలకుండా పట్టుకుందో.. హీరోయిన్లకు ఈ జీరో సైజ్ ట్రెండ్ అలా పట్టుకుంది.

ఈమధ్య ఈ ట్రెండ్ టాలీవుడ్ లో మరీ ఎక్కువైపోయింది. అల్ట్రా స్లిమ్ బాడీని సాధించాలనేది హీరోయిన్లలో ఇప్పుడొక క్రేజుగా మారిపోయింది. స్వీటీ అనుష్క 'సైజ్ జీరో' కోసం బరువు పెరిగింది కానీ తగ్గలేకపోయింది. ఎన్నో ప్రయత్నాలు చేసి ఆఖరికి అధిక బరువును వదిలించుకోవడంలో విజయం సాధించింది. సరే.. అనుష్క అంటే కాస్త ఎక్కువ వెయిట్ ఉంది కాబట్టి స్లిమ్ అయితే పర్వాలేదు అనుకోవచ్చు.. కానీ చాలామంది ఇతర హీరోయిన్లు కూడా ఇదే బాటపట్టారు. తెలుగు భామ అంజలి మొదటి నుంచి కాస్త బొద్దుగానే ఉండేది. కానీ ఈమధ్య 'నిశ్శబ్దం' సినిమా కోసం 8 కేజీలు తగ్గి స్లిమ్ముగా మారిపోయింది. ఇక కీర్తి సురేష్ విషయానికి వస్తే 'మహానటి' లో ఎలా ఉందో అందరికీ తెలిసిందే. కానీ ఈమధ్య సన్నగా రివటలాగా మారిపోయింది.

రాశి ఖన్నా కూడా అదే వ్యవహారం. ముద్దుగా బొద్దుగా ఉండే పిల్ల కాస్తా అల్ట్రా స్లిమ్ గా మారిపోయి ఎడాపెడా ఫోటో షూట్లలో పాల్గొంటోంది. మరో బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ మొదటి నుంచి మీడియం వెయిట్ తో ఉండే భామే. కానీ హిందీ సినిమా 'దేదే ప్యార్ దే' కోసం వెయిట్ తగ్గి బక్కగా మారింది. ఈ జీరో సైజ్ అవతారాలలో కొంతమంది అందంగానే ఉన్నారు. కొందరికి మాత్రం వారి సహజమైన అందం దెబ్బతింటోంది. ఫేస్ లో గ్లో తగ్గిందని కూడా అక్కడక్కడా కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఫిట్ గా ఉండడం.. ఆరోగ్యంగా ఉండడం అందరికీ ముఖ్యం. కానీ ఈ జీరో సైజ్ మాయలో పడి సహజమైన అందాన్ని పోగొట్టుకోవడం.. లేనిపోని కొత్త సమస్యలు తెచ్చుకోకుండా ఉండాలని కొందరు నెటిజన్లు ఈ భామలకు సూచిస్తున్నారు.