Begin typing your search above and press return to search.

అనారోగ్యంతో కన్నుమూసిన బుల్లితెర నటి

By:  Tupaki Desk   |   18 Oct 2021 3:39 AM GMT
అనారోగ్యంతో కన్నుమూసిన బుల్లితెర నటి
X
పెద్ద వయసు లేకుండానే అనారోగ్యంతో కానీ.. ఇతరత్రా అంశాతో ఆత్మహత్యలతో మరణిస్తున్న సెలబ్రిటీల విషాద ఉదంతాలు ఈ మధ్యన ఎక్కువ అవుతున్నాయి. తాజాగా బుల్లితెర నటి ఉమామహేశ్వరి ఆ జాబితాలో చేరారు. కేవలం 40 ఏళ్ల చిరుప్రాయంలో ఆమె తుదిశ్వాస విడిచారు. తమిళ సీరియల్స్ లో పాపులర్ అయిన ఆమె.. పలు సీరియళ్లలో నటించారు.

ప్రేక్షకుల మన్నన పొందిన సీరియల్స్ లో నటించిన ఆమె.. ఒరు కథైయిన్‌ కథై, మంజల్‌ మహిమై.. అల్లి అర్జన్.. కొడికట్టు.. వెట్టి చాకిరి తదితర సీరియళ్లలో ప్రధాన పాత్ర పోషించారు. పెళ్లి తర్వాత నటనకు స్వస్తి పలికిన ఆమె.. కొంతకాలంగా నటనకు దూరంగా ఉంటున్నారు. పశువైద్యుడైన భర్తతో కలిసి ఉంటున్నారు. కొంతకాలంగా అనారోగ్యానికి గురైన ఆమె.. వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారు. ఇలాంటి వేళలోనే ఆమెకు అనారోగ్యం తీవ్రత ఎక్కువ కావటంతో ఆసుపత్రికి తరలించారు. అయినా ఫలితం లేకుండా పోయింది. ఆమె మరణించినట్లు వైద్యులు వెల్లడించారు. చిరుప్రాయంలోనే అనారోగ్యంతో మరణించిన వైనం విషాదం కమ్మేసేలా మారింది.