Begin typing your search above and press return to search.

కన్నీరు పెట్టించిన హీరోయిన్‌ పోస్ట్‌

By:  Tupaki Desk   |   15 Jun 2021 6:00 PM IST
కన్నీరు పెట్టించిన హీరోయిన్‌ పోస్ట్‌
X
బాలీవుడ్‌ దివంగత హీరో సుశాంత్ సింగ్ రాజ్‌ పూత్ మొదటి వర్థంతి సందర్బంగా ఆయన్ను అభిమానులు మరోసారి జ్ఞప్తికి తెచ్చుకున్నారు. ఆయన నటించిన సినిమాల తాలూకు ఫొటోలు మరియు వీడియోలను షేర్‌ చేయడంతో పాటు ఆయన చెప్పిన డైలాగ్ లను నెమరవేసుకున్నారు. ఇక ఆయనతో వర్క్ చేసిన వారు అందుకు సంబంధించిన వర్కింగ్ స్టిల్స్ ను సోషల్‌ మీడియా ద్వారా షేర్‌ చేశారు. మొత్తంగా ఆయన వర్థంతి సందర్బంగా సోషల్‌ మీడియాలో ఆయన పేరు మారు మ్రోగింది. ఈ సమయంలో హీరోయిన్‌ కృతి సనన్ షేర్‌ చేసిన ఫొటోలు మరియు ఆమె పోస్ట్‌ అందరి దృష్టిని ఆకర్షించింది.

తన సోషల్‌ మీడియా వాల్ పై కృతి సనన్‌ ఫొటోను షేర్‌ చేసింది. రాబ్తా సినిమాలో సుశాంత్ సింగ్ తో చేసిన లవ్‌ సీన్స్ తాలూకు ఫొటోలను గ్రూప్ గా ఒక్క పిక్చర్‌ లో చూపించే ప్రయత్నం చేసింది. దాంతో పాటు కృతి సనన్.. మనం ఇద్దరం మొదటి సారి కలిసిన సమయంలో కనీసం మాట్లాడుకోలేదు. ఆ తర్వాత ఫొటో షూట్‌ కు కలిసిన సమయంలో కూడా ఇద్దరం ఒకరికి ఒకరు తెలియదు అన్నట్లుగానే ఉన్నాం. ఒకరి పట్ల ఒకరం పూర్తి గౌరవంతో మనం వర్క్‌ చేశాం. సినిమాలో ఇద్దరి ప్రపంచాలు ఎలా కలిశాయో అనేది చూపించాం అంది. ఈ రోజున నాకు చాలా బాధగా ఉంది. గతంలో మన ఇద్దరం ఉన్న ఈ ప్రపంచంలో ఇప్పుడు నువ్వు లేవు అనే విషయం నాకు ఇబ్బందిగా అనిపిస్తుంది. నేను ఇంకా నువ్వు లేవు అనే విషయాన్ని నమ్మలేక పోతున్నాను అంది.

గతంలో సుశాంత్‌ సింగ్ మరియు కృతి సనన్ ల మద్య ప్రేమ వ్యవహారం సాగిందనే పుకార్లు షికార్లు చేశాయి. కాని ఇద్దరు కూడా ఆ వార్తలను పుకార్లే అంటూ కొట్టి పారేశారు. ఇద్దరు కూడా రాబ్తా సినిమా షూటింగ్‌ సమయంలో మంచి స్నేహితులగా మెలిగే వారని.. ఇద్దరు కూడా ఒకరిపై ఒకరు గౌరవంను కనబర్చుకునే వారు అంటూ యూనిట్‌ సభ్యులు చెబుతూ ఉంటారు. సుశాంత్‌ వర్థంతి సందర్బంగా కృతి సనన్‌ చేసిన పోస్ట్‌ కన్నీరు పెట్టించే విధంగా ఉందంటూ నెటిజన్స్‌ కామెంట్స్ చేస్తున్నారు.