Begin typing your search above and press return to search.

బర్త్ డే బాయ్ కి అడవిని రాసిచ్చేశారు

By:  Tupaki Desk   |   21 Dec 2017 11:38 AM GMT
బర్త్ డే బాయ్ కి అడవిని రాసిచ్చేశారు
X
బాలీవుడ్ లో సెలబ్రేటిస్ వేడుకలు ఏ రేంజ్ జరుగుతాయో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. చిన్న వేడుకైన సరే తారలందరూ దిగి రావాల్సిందే. ఇకపోతే రీసెంట్ గా బాలీవుడ్‌ ‘పటౌడీ’ దంపతులు సైఫ్‌ అలీ ఖాన్‌ - కరీనాకపూర్‌ కుమారుడు తైమూర్‌ అలీఖాన్‌ మొదటి బర్త్ డే ను గ్రాండ్ గా చేసుకున్నాడు. వేడుకకి బాలీవుడ్ ప్రముఖ తారాగణం కదిలి వచ్చింది. రూ.800 కోట్ల విలువైన పటౌడీ ప్యాలెస్ లో ఈ వేడుక జరిగింది.

అయితే వేడుకకు వచ్చిన వారు ఎదో ఒక గిఫ్ట్ తేవడం ఆనవాయితీ. ఎవరి రేంజ్ కి తగ్గట్టు వారు ఎదో ఒక స్పెషల్ గిఫ్ట్ ను ఇస్తుంటారు. అయితే ఒకరు మాత్రం తైమూర్ కి ఎప్పటికి గుర్తుండిపోయే చిరకాల బహుమతిని ఇచ్చారు. తైమూర్ కోసం ఏకంగా ఒక అడవినే రాసి ఇచ్చారట. వారు ఎవరో కాదు.. బాలీవుడ్‌ ప్రముఖులకు పోషకాహార నిపుణురాలిగా వ్యవహరిస్తున్న రుజుతా దివాకర్‌.

గత కొన్నేళ్లుగా కరీనాతో పాటు పలు స్టార్ హీరోయిన్స్ కి అత్యంత సన్నిహితంగా ఉండే రుజుతా.. మహారాష్ట్ర పాల్ఘర్‌ ప్రాంతంలోని సొనావేలో ఉన్న చిన్న అడవిని బర్త్ డే బాయ్ కి రాసిచ్చినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియా ద్వారా తెలిపింది. పక్షులను మొక్కలను ఇవ్వడం కన్నా ఏకంగా అడవినే రాసిస్తే ఒక పనైపోతుందని అంతే కాకుండా వారికీ చిరకాలం గుర్తుంటుందని ఆమె తెలిపింది.