Begin typing your search above and press return to search.

మరో పాన్ ఇండియా ప్రాజెక్ట్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ప్రభాస్...?

By:  Tupaki Desk   |   5 Aug 2020 11:10 AM GMT
మరో పాన్ ఇండియా ప్రాజెక్ట్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ప్రభాస్...?
X
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ 'బాహుబలి' సినిమాతో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు. అప్పటి వరకు టాలీవుడ్ స్టార్ హీరోగా ఉన్న ప్రభాస్ 'పాన్ ఇండియా స్టార్'గా మారిపోయారు. ఈ క్రమంలో తదుపరి సినిమా 'సాహో'తో పాన్ ఇండియా స్టార్ ఇమేజ్ నిలబెట్టుకున్నాడు ప్రభాస్. అందుకే ఇప్పుడు బాలీవుడ్ నిర్మాతలు సైతం డార్లింగ్ డేట్స్ కోసం క్యూ కడుతున్నారు. ఈ నేపథ్యంలో 'బాహుబలి' సినిమా కోసం ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్ తో కలిసి వర్క్ చేసిన ప్రభాస్.. 'సాహో' సినిమాతో టీ - సిరీస్ భూషణ్ కుమార్ తో కలిసాడు. ప్రస్తుతం రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న ''రాధే శ్యామ్'' సినిమాకి కూడా టీ - సిరీస్ భూషణ్ కుమార్ ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలో టీ - సిరీస్ వారు యంగ్ రెబల్ స్టార్ తో మూడో చిత్రంగా మరో పాన్ ఇండియా ప్రాజెక్ట్ చేయబోతున్నారని బాలీవుడ్ మీడియా వర్గాల్లో చర్చించుకుంటున్నారు.

కాగా ప్రభాస్ తో టీ-సిరీస్ అధినేత భూషణ్ కుమార్ ఓ భారీ పౌరాణిక చిత్రాన్ని తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నారట. భారీ బడ్జెట్ తో తెరకెక్కనున్న ఈ మైథోలాజికల్ డ్రామా స్టోరీ లైన్ ఇప్పటికే ప్రభాస్ కి చెప్పారని తెలుస్తోంది. అంతేకాకుండా స్టోరీ లైన్ కి ఇంప్రెస్ ఐన డార్లింగ్ ప్రభాస్ ఈ ప్రాజెక్ట్ కి వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని.. కంప్లీట్ స్క్రిప్ట్ రెడీ చేయమని చెప్పాడని బాలీవుడ్ మీడియాలో న్యూస్ స్ప్రెడ్ అయింది. ప్రభాస్ కి దేశవ్యాప్తంగా ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ ని దృష్టిలో పెట్టుకొని ఈ సినిమాని కూడా పలు భారతీయ భాషల్లో రూపొందిస్తారట. ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న ''రాధే శ్యామ్'' మరియు నాగ్ అశ్విన్ ప్రాజెక్ట్ కంప్లీట్ అయిన తర్వాత టీ-సిరీస్ నిర్మాణంలో ఈ భారీ పౌరాణిక చిత్రం పట్టాలెక్కే అవకాశం ఉంది.

ఇదిలా ఉండగా ''రాధే శ్యామ్'' సినిమా ఇప్పటికే సగభాగం చిత్రీకరణ పూర్తి చేసుకుంది. పరిస్థితులు అనకూలిస్తే వీలైనంత త్వరగా షూటింగ్ పూర్తిచేసి విడుదలకు సిద్ధం చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోంది. ఇక ప్రభాస్ - నాగ్ అశ్విన్ కాంబినేషన్ లో తెరకెక్కనున్న ప్రాజెక్ట్ ని వైజయంతీ మూవీస్ బ్యానర్ పై అశ్వినీ దత్ నిర్మించనున్నారు. భారీ బడ్జెట్ తో రూపొందనున్న ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ దీపికా పడుకుణే హీరోయిన్ గా నటించనుంది. దేశ విదేశాల్లో ప్రభాస్ కి ఉన్న క్రేజ్ ని దృష్టిలో పెట్టుకొని ఈ చిత్రాన్ని అంతర్జాతీయ స్థాయిలో విడుదల చేయాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తున్నారట. ఇదే కనుక నిజమైతే పాన్ ఇండియా స్టార్ అనిపించుకున్న ప్రభాస్ కాస్తా ఈ సినిమాతో 'గ్లోబల్ స్టార్' గా మారిపోతాడని చెప్పవచ్చు.