Begin typing your search above and press return to search.

ఆ సినిమాలో స్వాతి ఫిక్స్.. పాత్ర ఇదే

By:  Tupaki Desk   |   21 April 2020 3:48 PM GMT
ఆ సినిమాలో స్వాతి ఫిక్స్.. పాత్ర ఇదే
X
యువ హీరో నిఖిల్ - మొండేటి కాంబినేషన్ లో తెరకెక్కిన 'కార్తికేయ' బాక్స్ ఆఫీస్ దగ్గర అ ఘన విజయం సాధించింది. ఇప్పుడు ఆ సినిమాకు సీక్వెల్ తీసే ప్రయత్నాలు మొదలయ్యాయి. 'కార్తికేయ'లో హీరోయిన్ గా నటించిన స్వాతి రెడ్డి ఈ సీక్వెల్ లో కూడా ఒక ప్రధాన పాత్రలో నటించబోతోందని గతంలోనే వార్తలు వచ్చాయి. తాజాగా ఈ విషయంపై మరింత క్లారిటీ వచ్చింది.

ఈ సినిమాలో స్వాతి హీరో నిఖిల్ కి మాజీ ప్రేయసిగా నటిస్తోందని సమాచారం. ఇక ఈ సినిమాలో మెయిన్ హీరోయిన్ గా అనుపమ పరమేశ్వరన్ ను ఎంచుకున్నారని అంటున్నారు. సీక్వెల్ కూడా మొదటి భాగం అలాగే థ్రిల్లింగ్ ఎలిమెంట్ తో తెరకెక్కుతుందని.. అలాగే ఈ కథకు నేపథ్యంగా ఎంచుకున్న ఒక చారిత్రాత్మక అంశం ప్రేక్షకులను కట్టిపడేసేలా ఉంటుందని ఇన్ సైడ్ టాక్. చందూ మొండేటి ఇప్పటికే స్క్రిప్టును పకడ్బందీగా రూపొందించారని.. లాక్ డౌన్ ముగిసిన తర్వాత ఎక్కువ ఆలస్యం లేకుండా సినిమా పట్టాలెక్కుతుందని సమాచారం.

ఈ సినిమాను పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టి జి విశ్వప్రసాద్.. వివేక్ కూచిభొట్ల సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అభిషేక్ పిక్చర్స్ బ్యానర్ వారు కూడా ఈ సినిమా నిర్మాణంలో పాలు పంచుకుంటున్నారని సమాచారం. మరి ఈ సీక్వెల్ అంచనాలను అందుకుంటుందా.. నిఖిల్ - చందు మొండేటి కాంబో కు మరో హిట్ అందిస్తుందా అనేది వేచి చూడాలి.