Begin typing your search above and press return to search.

#SVP.. ప్రీమియ‌ర్ల నుంచే బ్రేక్ ఈవెన్‌?

By:  Tupaki Desk   |   26 April 2022 4:28 AM GMT
#SVP.. ప్రీమియ‌ర్ల నుంచే బ్రేక్ ఈవెన్‌?
X
సూప‌ర్ స్టార్ మ‌హేష్ న‌టించిన సర్కార్ వారి పాట మే 12న‌ గ్రాండ్ రిలీజ్ కి సిద్ధ‌మ‌వుతున్న సంగ‌తి తెలిసిందే. ప‌ర‌శురామ్ ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఇప్ప‌టికే ఇంటా బ‌య‌టా ప్రీరిలీజ్ బిజినెస్ ప‌రంగా బోలెడంత హైప్ నెల‌కొంది. భారీ మొత్తాల‌కు బ‌య్య‌ర్లు రైట్స్ ని కొనుగోలు చేసిన సంగ‌తి తెలిసిందే.

ఇక అమెరికా లాంటి చోట మ‌హేష్ కి ఉన్న అరుదైన రికార్డ్ గురించి తెలిసిందే. అత‌డు న‌టించిన సీత‌మ్మ వాకిట్లో సిరిమ‌ల్లె చెట్టు- శ్రీ‌మంతుడు- భ‌రత్ అనే నేను వంటి చిత్రాలు అమెరికాలో చ‌క్క‌ని వ‌సూళ్ల‌ను సాధించాయి. మిలియ‌న్ డాల‌ర్ క్ల‌బ్ లో అత‌డి సినిమాలెన్నో ఉన్నాయి.

మూవీ క‌నెక్ట‌యితే కేవ‌లం అమెరికా నుంచే సునాయాసంగా 20కోట్లు పైగా తేగ‌లిగే స‌మ‌ర్థ‌త మ‌హేష్ కి ఉంది. అందుకే ఇప్పుడు రిలీజ్ కి సిద్ధ‌మ‌వుతున్న స‌ర్కార్ వారి పాట పైనా భారీ అంచ‌నాలేర్ప‌డ్డాయి. ఆస‌క్తిక‌రంగా అమెరికాలో SVP పంపిణీ వ‌ర్గాలు ప్రీమియ‌ర్ల‌తోనే సేఫ్ అవ్వాల‌ని ప్లాన్ చేస్తున్నాయ‌ని తెలిసింది. పెట్టిన పెట్టుబ‌డి మొత్తాన్ని ప్రీమియ‌ర్ల నుంచే రాబ‌ట్టాల‌ని బ్రేక్ ఈవెన్ సాధించాల‌ని అమెరికా బ‌య్య‌ర్లు గ్రాండ్ రిలీజ్ కి ప్లాన్ చేస్తున్నారు. ఇప్ప‌టికే అమెరికాలో ఎస్.వీ.పీ బుకింగులు కూడా ఓపెన‌య్యాయి. ఇక రిలీజ్ త‌ర్వాత టాక్ తో సంబంధం లేకుండానే సేఫ్ జోన్ కి వ‌చ్చేందుకు ప‌క‌డ్భందీ ప్లాన్ సాగుతోందిట‌. ఆ త‌ర్వాత ఎలాంటి తేడా జ‌రిగినా ముందుగానే తాము సేఫ్ జోన్ లో ఉండాల‌నేది ప్లాన్.

విదేశాల్లో మ‌హేష్‌..

'సర్కారు వారి పాట' విడుద‌ల‌కు క‌నీసం రెండు వారాల స‌మ‌యం కూడా లేదు. ఈ మూవీ ప్ర‌మోష‌న్స్ కి ఇది కీల‌క స‌మ‌యం. కానీ ఇప్పుడు ఉన్న‌ట్టుండి ఆక‌స్మికంగా సూప‌ర్ స్టార్ మ‌హేష్ విదేశాల‌కు ప్ర‌యాణ‌మ‌వ్వ‌డం హాట్ టాపిక్ గా మారింది. ఆదివారం నాడు సూప‌ర్ స్టార్ మ‌హేష్‌ దుబాయ్ కి వెళుతూ హైదరాబాద్‌ విమానాశ్రయంలో కనిపించడంతో ర‌క‌ర‌కాల గుస‌గుస‌లు వైర‌ల్ అయిపోతున్నాయి.

ఈ ప్ర‌యాణం ఒంట‌రిగా కాదు.. త‌న‌తో పాటే ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి జాయిన్ అవుతున్నార‌న్న టాక్ వినిపించింది. ఇక మ‌హేష్ - రాజ‌మౌళి చిత్రం స్క్రిప్టు ప‌నులు సాగుతుండ‌గా.. వచ్చే ఏడాది ఈ క్రేజీ పాన్ ఇండియా చిత్రం సెట్స్ పైకి వెళ్లనుంది. అయితే ఇప్ప‌టికే ప‌లు క‌థ‌ల‌ను రాజ‌మౌళి మ‌హేష్ కి వినిపించినా ఏదీ ఖ‌రారు చేయ‌లేద‌న్న టాక్ ఉంది. దీంతో ఆ ఇద్ద‌రూ సీరియ‌స్ గా ఇక‌పై త‌మ ప్రాజెక్ట్ పై దృష్టి సారిస్తార‌ని క‌థా చ‌ర్చ‌లు సాగించేందుకే ఇప్పుడు దుబాయ్ వెళుతున్నార‌ని గుస‌గుస వినిపిస్తోంది.

'సర్కారు వారి పాట' డబ్బింగ్ సెషన్స్ ప్రమోషనల్ ఈవెంట్ లలో పాల్గొనాల్సిన మహేష్ దుబాయ్ కి ఆక‌స్మిక‌ పర్యటనను ఖ‌రారు చేయ‌డం వ‌ల్ల‌నే ఇన్ని సందేహాలు నెల‌కొన్నాయి. అయితే ఈసారి షార్ప్ గా ప‌ర్య‌ట‌న ముగించి తిరిగి స‌ర్కార్ వారి ప్ర‌మోష‌న్స్ లో పాల్గొనేందుకు మ‌హేష్ వెన‌క్కి వ‌స్తార‌ట‌. ఇక ఏదైనా సినిమాని ప్రారంభించే ముందు కానీ చిత్రీక‌ర‌ణ పూర్త‌యిన అనంత‌రం కానీ వెకేష‌న్స్ కి వెళ్లి రిలాక్స‌య్యే అల‌వాటు మ‌హేష్ కి ఉంది.