Begin typing your search above and press return to search.

కెకె సింగ్ పై ఎదురుదాడి ప్రారంభించిన సుశాంత్ ప్రేయసి!

By:  Tupaki Desk   |   31 July 2020 10:30 AM GMT
కెకె సింగ్ పై ఎదురుదాడి ప్రారంభించిన సుశాంత్ ప్రేయసి!
X
దివంగత సినీ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య కేసు రోజురోజుకి కొత్త మలుపులు తిరుగుతుంది. ఈ కేసులో ఫస్ట్ నుండి ఆరోపణలను తీవ్రంగా ఎదుర్కొంటున్న హీరోయిన్ రియా చక్రవర్తి. అయితే తాజాగా సుశాంత్ తండ్రి పేర్కొన్న ఆరోపణలు భరించలేక ఎదురుదాడిని ప్రారంభించింది. ఈ నేపథ్యంలో తన లాయర్ సతీష్ మానేషిండే సమక్షంలో పాట్నాలో సుశాంత్ తండ్రి పెట్టిన కేసును ముంబైకి బదిలీ చేయాలని సుప్రీం కోర్టును కోరింది. రియా కెకె సింగ్ చేసిన ఆరోపణల పై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసింది. ఆమె మాట్లాడుతూ.. నాతో పాటు మరో ఆరుగురు కలిసి సుశాంత్ ని సూసైడ్ చేసుకునేలా ప్రేరేపించినట్లు చేసిన అభియోగం పూర్తి అవాస్తవం. నాపై లేనిపోని అభియోగాలు మోపడంతో నాకు ప్రాణహాని కలిగింది. నన్ను ఎవరో నాకు తెలియని వారు బెదిరిస్తున్నారు.

ఇప్పటికే సుశాంత్ దూరమైన బాధలో ఉంటే తప్పుడు ఆరోపణలు చేస్తూ నన్ను మరింత కుంగదీస్తున్నారు. నేను జూన్ 8 వరకు సుశాంత్‌తో కలిసి ఉన్నాను. అప్పుడు కూడా సుశాంత్ డిప్రెషన్ దూరం చేసే మందులు వాడుతున్నాడు. ఇవేవి తెలుసుకోకుండా నాపై అభియోగాలు మోపారంటూ.. రియా సుప్రీంకోర్టుకు మొరపెట్టుకుంది. సుశాంత్ తండ్రి ఫిర్యాదు పై రియా లాయర్ సతీష్ మానేషిండే స్పందించి.. 'తన క్లయింట్ రియా ఆన్‌లైన్ ద్వారా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. మొదటి నుండి ముంబై పోలీసులు ఈ కేసును దర్యాప్తు చేస్తున్నందున పాట్నా కేసును కూడా ముంబైకి బదిలీ చేయాలనీ వినతి పత్రం అందించినట్లు ఆయన తెలిపారు. ఇదిలా ఉండగా.. సుశాంత్ తండ్రి పెట్టిన కేసు వలన తనకు ప్రాణహాని ఉందని ముంబైలోని శాంతాక్రజ్ పోలీస్ స్టేషన్‌లో రియా చక్రవర్తి కేసు పెట్టింది. ప్రస్తుతం రియా.. కెకె సింగ్ ల మధ్య పచ్చగడ్డి వేసినా భగ్గుమనేలా ఉందంటూ ఇండస్ట్రీలో టాక్ నడుస్తుంది.