Begin typing your search above and press return to search.

సుశాంత్‌ పోస్ట్‌ మార్టమ్‌ రిపోర్ట్‌!

By:  Tupaki Desk   |   15 Jun 2020 11:10 AM GMT
సుశాంత్‌ పోస్ట్‌ మార్టమ్‌ రిపోర్ట్‌!
X
ఆదివారం తన ఇంట్లో శవం అయ్యి కనిపించిన బాలీవుడ్‌ యంగ్‌ హీరో సుశాంత్‌ రాజ్‌ పూత్‌ మృత దేశంకు పోస్ట్‌ మార్టమ్‌ పూర్తి అయ్యింది. పోస్ట్‌ మార్టం లో సుశాంత్‌ ఆత్మహత్య చేసుకుని చనిపోయినట్లుగా నిర్ధారణకు వచ్చారు. విష ప్రయోగం ఏమైనా జరిగి ఉంటుందా అనే అనుమానంతో పోస్ట్‌ మార్టంను దాదాపు నాలుగు గంటల పాటు నిర్వహించినట్లుగా వైధ్యులు పేర్కొన్నారు. ఊపిరి ఆడక మెడ ఎముక చిట్లడం వంటి కారణాల వల్ల ఆయన మృతి చెందినట్లుగా పోస్ట్‌ మార్టంలో వైధ్యులు పేర్కొన్నారు.

ఈ రకమైన మృతి కేవలం ఉరి వేసుకుంటేనే అవుతుందని అందుకే సుశాంత్‌ ది ఆత్మ హత్య అంటూ పోలీసులు నిర్ధారణకు వచ్చారు. అయితే ఆత్మహత్యకు పురిగొల్పిన విషయాలు ఏమై ఉంటాయి అనేది ప్రస్తుతం పోలీసుల ఎంక్వౌరీలో వెళ్లడవ్వాల్సి ఉంది. సుశాంత్‌ డెడ్‌ బాడీని ఆయన ఇంటి పని మనిషిని చూసింది. వెంటనే ఆమె పోలీసులకు తెలియజేయడం జరిగిందని స్థానికుల కథనం.

సుశాంత్‌ భౌతిక కాయంను ఆయన కుటుంబ సభ్యులకు అప్పగించారు. నేడు అంత్యక్రియలు నిర్వహించబోతున్నారు. బాలీవుడ్‌ సినీ ప్రముఖులు మరియు ప్రముఖులు సుశాంత్‌ రాజ్‌ పూత్‌ మృత దేహంకు నివాళ్లు అర్పించారు. మొదట అంత్యక్రియలు ముంబయిలో అనుకున్నా ఆ తర్వాత ఆయన స్వరాష్ట్రం బీహార్‌కు తీసుకు వెళ్లాలని నిర్ణయించారు. సుశాంత్‌ తల్లిదండ్రులు ఇప్పటికే బీహార్‌ నుండి ముంబయికి చేరుకుని కుమారుడి మృత దేహంను బీహార్‌ కు తీసుకు వెళ్లినట్లుగా జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి.