Begin typing your search above and press return to search.

క్రేజీ డైరెక్ట‌ర్ తో సూర్య సినిమా మొద‌లైంది

By:  Tupaki Desk   |   28 March 2022 9:30 AM GMT
క్రేజీ డైరెక్ట‌ర్ తో సూర్య సినిమా మొద‌లైంది
X
త‌మిళ ద‌ర్శ‌కుడు బాల - సూర్య‌ల క‌ల‌యిక‌లో సినిమా వ‌చ్చి దాదాపు 18 ఏళ్ల‌కు పైనే అవుతోంది. వీరి కల‌యిక‌లో వ‌చ్చిన చివ‌రి చిత్రం `పితామ‌గ‌న్‌`. తెలుగులో ఇదే చిత్రాన్ని `శివ‌ పుత్రుడు` గా విడుద‌ల చేశారు. చియాన్ విక్ర‌మ్‌, సూర్య క‌లిసి న‌టించిన ఈ చిత్రంలో విక్ర‌మ్ టైటిల్ పాత్ర‌ని పోషించ‌గా సూర్య సెకండ్ హీరోగా న‌టించారు. ఈ మూవీ తెలుగు, త‌మిళ భాష‌ల్లో సంచ‌ల‌న విజ‌యాన్ని సాధించింది. తెలుగులో సూర్య‌కు మంచి పేరు తెచ్చిపెట్టింది. ఈ మూవీ త‌రువాత మ‌ళ్లీ వీరిద్ద‌రి క‌ల‌యిక‌లో మ‌రో సినిమా రాలేదు.

మ‌ళ్లీ ఇన్నేళ్ల‌కు సూర్య - బాల క‌లిసి సినిమా చేయ‌బోతున్నారు. ఇది సూర్య న‌టిస్తున్న 41వ చిత్రం. ఇటీవ‌ల సూర్య `ఈటీ` మూవీతో ప్రేక్ష‌కుల ముందుకొచ్చిన విష‌యం తెలిసిందే. ఈ మూవీ రెండు భాష‌ల్లోనూ అశించిన ఫ‌లితాన్ని అందించ‌క‌పోవ‌డంతో వెంట‌నే సూర్య డైరెక్ట‌ర్ బాల తో సినిమాని ప‌ట్టాలెక్కించారు. ఈ మూవీని 2డీ ఎంట‌ర్ టైన్ మెంట్స్ బ్యాన‌ర్ పై సూర్య స్వ‌యంగా నిర్మిస్తున్నారు.

ఈ మూవీపై గ‌త కొన్ని రోజులుగా వ‌రుస క‌థ‌నాలు విపించాయి. తాజాగా ఆవార్త‌ల‌ని నిజం చేస్తే చిత్ర బృందం సోమ‌వారం ఈ మూవీని లాంఛ‌నంగా ప్రారంభించింది.

స‌రికొత్త క‌థ‌తో బాలా రూపొందించ‌నున్న ఈ మూవీ పూజా కార్య‌క్ర‌మాలు సోమ‌వారం క‌న్యాకుమారిలో జ‌రిగాయి. ఈ రోజు నుంచే ఈ మూవీ రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభం అయింది. ఈ విష‌యాన్ని చిత్ర బృందం సోష‌ల్ మీడియా ట్విట్ట‌ర్ ద్వారా వెల్ల‌డించారు. సూర్య‌కు జోడీగా ఈ చిత్రంలో క్రేజీ హీరోయిన్ కృతిశెట్టి న‌టిస్తోంది. సోమ‌వారం సినిమా లాంఛ‌నంగా ప్రారంభ‌మైన సంద‌ర్భంగా చిత్ర బృందం ఇందులో సూర్య‌కు జోడీగా కృతిశెట్టి న‌టిస్తున్న విష‌యాన్ని అధికారికంగా ప్ర‌క‌టించారు.

ఈ చిత్రానికి సంబంధించిన మ‌రో ఆస‌క్తిక‌ర‌మై విష‌యం ఏంటంటే ఇందులో సూర్య వైఫ్‌, ఒక నాటి క్రేజీ హీరోయిన్ జ్యోతిక కూడా కీల‌క పాత్ర‌లో క‌నిపించ‌బోతోంది. అమె పాత్ర ఏంటీ? ఎలా వుండ‌బోతోంద‌న్న‌ది మాత్రం ప్ర‌స్తుతానికి స‌స్పెన్స్‌. ఈ మూవీ కోసం క‌న్యాకుమారిలో ఓ విలేజ్ సెట్ ని నిర్మించారు. ఇందులోనే ప‌లు కీల‌క ఘ‌ట్టాల‌ని చిత్రీక‌రించ‌బోతున్నార‌ట‌. ఈ సెట్స్ కి సంబంధించిన ఫొటోలు ఫ్యాన్స్ ద్వారా బ‌య‌టికి వ‌చ్చేశాయి. ఇక ఈ మూవీకి సంబంధించిన మ‌రో ఆస‌క్తిక‌ర‌మైన అప్ డేట్ సూర్య ఫ్యాన్స్ ని స‌ర్ ప్రైజ్ చేస్తోంది.

ఇందులో హీరో సూర్య డ్యుయెల్ రోల్ లో క‌నిపించ‌బోతున్నార‌ట‌. ఓ పాత్ర‌కు జ్యోతిక జోడీగా న‌టించ‌నుండ‌గా మ‌రో యంగ్ క్యారెక్ట‌ర్ కు కృతిశెట్టి జోడీగా న‌టించ‌నుంద‌ని తెలుస్తోంది. బాల మార్కు సినిమాగా తెర‌పైకి రానున్న ఈ చిత్రానికి జీవీ ప్ర‌కాష్ కుమార్ సంగీతం అందించ‌నున్నారు. బాల‌సుబ్ర‌మ‌ణియ‌న్ ఛాయాగ్ర‌హ‌ణం అందిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన మ‌రిన్ని విరాలు తెలియాల్సి వుంది.