Begin typing your search above and press return to search.

దీవాలి బరిలో తలపడనున్న సూపర్ స్టార్స్..!

By:  Tupaki Desk   |   10 April 2021 12:30 PM GMT
దీవాలి బరిలో తలపడనున్న సూపర్ స్టార్స్..!
X
దేశవ్యాప్తంగా సినీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాలలో సూపర్ స్టార్ రజినీకాంత్ 'అన్నాతే', ఉలగనాయగన్ కమల్ హాసన్ 'విక్రమ్' కూడా ముందువరుసలో ఉన్నాయి. ఈ ఇద్దరి సూపర్ స్టార్స్ సినిమాలు ఇదివరకే ఫస్ట్ లుక్కులతో సినిమాలపై మంచి బజ్ క్రియేట్ చేసాయి. సూపర్ స్టార్ రజినీ - స్టార్ డైరెక్టర్ శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న అన్నాతే సినిమా నిజానికి ఈ ఏడాది సంక్రాంతికే విడుదల కావాల్సింది. కానీ కరోనా కారణంగా షూటింగ్ నిలిచిపోయి ఇటీవలే మళ్లీ ప్రారంభించారు. గతేడాది దర్బార్ సినిమాతో అలరించిన రజినీ.. ఈ ఏడాది అన్నాతే సినిమాతో ఖచ్చితంగా హిట్ కొడతాడని ఫ్యాన్స్ ఎక్సపెక్ట్ చేస్తున్నారు. అయితే ఇటీవలే అన్నాతే సినిమాను దీవాలి కానుకగా నవంబర్ నెలలో విడుదల చేయనున్నట్లు ప్రకటించింది చిత్రబృందం.

ఇదిలా ఉండగా.. లోకనాయకుడు కమల్ హాసన్ నటిస్తున్న 'విక్రమ్' మూవీ కూడా ఈ ఏడాది సమ్మర్ లో రిలీజ్ కావాల్సింది. కానీ పలు కారణాల వలన సినిమా షూటింగ్ ఇంకా పూర్తికాలేదు. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ ప్రారంభించనున్నారు మేకర్స్. ఖైదీ, మాస్టర్ బ్లాక్ బస్టర్స్ తెరకెక్కించిన యువదర్శకుడు లోకేష్ కనగరాజ్ 'విక్రమ్' సినిమాను రూపొందిస్తున్నాడు. ఇప్పటికే సినిమా టీజర్ అంచనాలు పెంచేసింది. అయితే త్వరగా షూటింగ్ ప్రారంభించి ఈ సినిమాను కూడా దీవాలికి విడుదల చేసే ప్లాన్ లో ఉన్నట్లు సినీవర్గాలు చెబుతున్నాయి. ఇదేగనక నిజమైతే.. చాలకాలం తర్వాత సూపర్ స్టార్ రజినీ - కమల్ పోటీ కన్ఫర్మ్ అవుతుంది. అంటే బాక్సాఫీస్ దగ్గర రజినీ - కమల్ పోటీ తప్పేలా లేదు. చూడాలి మరి వీరిలో ఎవరు దీవాలి విన్నర్ అవుతారో..!