Begin typing your search above and press return to search.

ఏం పర్లేదు.. మూడ్నెళ్ళకో రిలీజ్‌

By:  Tupaki Desk   |   23 March 2016 5:30 PM GMT
ఏం పర్లేదు.. మూడ్నెళ్ళకో రిలీజ్‌
X
యంగ్‌ హీరో సందీప్‌ కిషన్‌ ఇప్పుడు ''రన్‌''తో హిట్టు కొట్టాడా లేదా అనే విషయం పక్కనెట్టేస్తే.. అసలు మనోడి ప్లానింగ్‌ ఉంది చూడండి.. ఇటు తెలుగు అండ్‌ అటు తమిళంలోనూ ఇరక్కొట్టేస్తున్నాడు. ఎలాగైనా సరే తన స్థానాన్ని పదిలం చేసుకోవాలనే ఉద్ద్యేశంతో మనోడు ఏకంగా మూడు సినిమాలను రెడీ చేస్తున్నాడు.

''ఒక అమ్మాయి తప్ప'' అంటూ రచయిత రాజసింహ డైరక్షన్‌ లో ఒక సినిమా చేస్తున్నాడు సందీప్‌. ఏకంగా ఇందులో నిత్యా మీనన్‌ హీరోయిన్‌. ఒక ఫ్లై ఓవర్‌ మీద ఓ రాత్రి జరిగే లవ్‌ స్టోరీ ఇది. రెండు పాటలే ఇంకా బ్యాలెన్స్‌ ఉన్నాయట. షూటింగ్‌ దాదాపు పూర్తయ్యిందట. మే నెలలో రిలీజ్‌ అంటున్నాడు. ఇది కాకుండా ''మా నగరం'' అంటూ ఒక షార్ట్‌ ఫిలిం డైరక్టర్‌ రూపొందిస్తున్న సినిమాలో నటిస్తున్నాడు సందీప్‌. ఇందులో రెజీనా హీరోయిన్‌. ఈ సినిమాలో మూడు నాలుగు డిఫరెంట్‌ కథలు ఉంటాయి. అన్నింటిలోనూ సందీప్‌ అండ్‌ రెజీనాయే హీరోహీరోయిన్లు. ఈ సినిమా ఆగస్టులో రావొచ్చు.

ఇకపోతే తమిళంలో పిజ్జా సినిమా ప్రొడ్యూసర్‌ సివి కుమార్‌ డైరక్షన్ లో మాయావన్‌ అనే సినిమా చేస్తున్నాడు. లావణ్య త్రిపాఠి హీరోయిన్‌ గా నటిస్తున్న ఈ సినిమా ఒక సైంటిఫిక్‌ థ్రిల్లర్‌. ఈ సినిమా కూడా ఆగస్టు తరువాత రిలీజ్‌ అయిపోతుందట. ఎలా చూసినా కూడా మార్చిలో రన్‌ వచ్చాక.. మూడ్నెళ్ళకో సినిమా అన్న చందంగా మనోడి ప్లానింగ్‌ ఉంది.